Lovers Road Accident: ఇంట్లోవారిని ఎదిరించారు.. కానీ విధి చేతిలో ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుకున్నది ఒక్కటి.. అయిందొకటి. తాము ఒకటి తలిస్తే విధి వేరొకటి తలిచింది. కాకినాడ జిల్లా పిఠాపురం లో ప్రేమజంట రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ప్రియుడు చనిపోగా ప్రియురాలు హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది..కొత్త జీవితం ప్రారంబిద్దామనుకునే లోపే వారి ఆశలు అడియాశలు ఆయ్యాయి.. ఇంట్లో వారిని ఎదిరించి ఒక్కటవుదాం అనుకున్నారు ఆ ప్రేమ జంట, యువకుడు కుటుంబ సభ్యులు మాత్రం యువతి కుటుంబ సభ్యులే చంపేసి ఆక్సిడెంట్ గా క్రియేట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు
కాకినాడకు చెందిన గణేష్ ,దీప్తి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.. గణేష్ డిగ్రీ చదువుతుండగా దీప్తి ఇంటర్ కంప్లీట్ చేసింది గత నెలలోనే దీప్తి తండ్రి అనారోగ్యంతో చనిపోయారు.. అయితే ఇద్దరు తమ ప్రేమని కుటుంబ సభ్యులకు చెప్పారు.. కలిసి జీవిస్తామని వారి నిర్ణయం కోసం ఎదురు చూశారు ఈ వయసులో పెళ్లి ఏంటని ఇరువురు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.. ముందు సెటిల్ అయ్యాక తర్వాత ఆలోచిద్దాం అని చెప్పారు.. అయితే గణేష్ దీప్తి లు మాత్రం మరొక విధంగా ఆలోచించారు కుటుంబ సభ్యులు తమను విడదీస్తారని ఇద్దరు ఒకటి అవ్వాలని నిర్ణయించుకున్నారు.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
వారిని ఎదిరించి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు ఇంట్లో వారికి చెప్ప కుండా అన్నవరం వెళ్లి సత్యదేవుని ఆలయ సన్నిధిలో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నారు.. అనుకున్న ప్రకారం గణేష్ , దీప్తి లు శుక్రవారం తెల్లవారుజామున బైకుపై బయలుదేరారు.. పిఠాపురం బీమ్ నగర్ వద్ద మలుపులో అదుపుతప్పి రైలింగ్ ను ఢీకొట్టారు.. తీవ్రగాయలయిన ఇద్దరిని హైవే పెట్రోలింగ్ పోలీసులు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. మార్గమధ్యలోనే గణేష్ మృతి చెందగా, దీప్తి ని మాత్రం మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో గణేష్ మృతి చెంది దీప్తి గాయాలతో బయటపడంపై తమకు అనుమానాలు ఉన్నాయని, వారు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని దీప్తి బంధువులు హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని మృతుడు గణేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గణేష్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేసారు.. పూరిస్తాయి దర్యాప్తు చేసి తమ కుమారుడు మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని గణేష్ తల్లిదండ్రులు కోరుతున్నారు.ఏది ఏమైనా తమ ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించకపోయిన, వారిని ఎదిరించి దైవ సన్నిధిలో ఒక్కటై కొత్త జీవితాన్ని ప్రారంభించాలని వారు కన్న కలలు అడియాసగానే మిగిలింది.. మృత్యువు వారిద్దరిని విడదీసింది..గణేష్ కుటుంబం లో కన్నీళ్లను మిగిల్చింది.
Heavy Rains: తెలంగాణలో వర్షబీభత్సం.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!