KVP Ramachandra Rao: జగన్కు ఎందుకు దూరంగా ఉన్నానంటే..? సమాధానం చెప్పాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KVP Ramachandra Rao: దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావును వైఎస్ ఆత్మగా పిలిచేవారు.. అయితే, వైఎస్సార్ కన్నుమూసిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్తో కేవీపీకి సంబంధాలు లేవు.. ఇవాళ విజయవాడలో మీట్ది ప్రెస్లో ఇదే ప్రశ్న కేవీపీకి ఎదురైంది.. దీనిపై స్పందిస్తూ.. వైఎస్సార్కు దగ్గరగా ఉన్న నేను జగన్కు ఎందుకు దూరమయ్యాననే అంశంపై ఇప్పుడు సమాధానం చెప్పబోనన్నారు.. కానీ, ఈ ప్రశ్నల నుంచి ఎంతో కాలం దూరం జరగలేను.. ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సిందే.. మరో రోజు ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు వివరిస్తానని తెలిపారు కేవీపీ.. దీంతో, ఆయన ప్రత్యేకంగా వైఎస్ రాజశేఖర్రెడ్డి, వైఎస్ జగన్ సంబంధాలపై ఏర్పాటు చేసే ఆ ప్రెస్మీట్లో ఏం చెప్పబోతున్నారు అనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది.
Read Also: Mahesh Babu: #SSMB28 షూటింగ్ బ్రేక్… సంక్రాంతి వరకూ టైం ఉంది కదా…
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
మరోవైపు.. బీజేపీ-వైసీపీ సంబంధాలపై సీరియస్గానే స్పందించారు కేవీపీ.. బీజేపీని వైసీపీ ఎందుకు ప్రశ్నించ లేకపోతుందో నాకు కారణం తెలియదన్న ఆయన.. ప్రత్యేక పరిస్థితులని చెప్పిన నేనే.. ఆ ప్రత్యేక పరిస్థితులేంటో తెలియదని చెబుతున్నాను అన్నారు.. ఇక, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు కేవీపీ.. 2018లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని నేను వ్యతిరేకించా.. ఈ విషయం ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పలేదు. టీడీపీతో పొత్తు నచ్చకున్నా.. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నోరు మెదపలేదన్నారు. ఆనాడు నేనెక్కడా ప్రచారంలో పాల్గొనలేదు. ప్రత్యేక హోదా అక్కర్లేదు.. ప్యాకేజీ చాలంటూ చంద్రబాబు ఏపీకి మరణ శాసనం రాశారని.. ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి దీక్ష చేయడం చంద్రబాబు వల్లే సాధ్యమైంది అంటూ మండిపడ్డారు. 2016లో రాహుల్ గాంధీ మీద రాళ్లేయించిన చంద్రబాబు.. 2018లో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని.. ఎన్టీఆర్ కోసం 1984లో పోరాటం చేసి.. అదే ఎన్టీఆర్ను పార్టీ నుంచి బయటకి పంపిన ఘనుడు చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు.
Read Also: YS Sharmila: బండి సంజయ్, రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్.. ఏం మాట్లాడారంటే?
వైఎస్ తవ్వించిన కాల్వల నుంచి నీరు పారించి.. మొత్తం నేనే చేశానని చెప్పుకునే ఘనుడు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు కేవీపీ.. సెల్ ఫోన్లు తెచ్చిన సమర్ధుడు చంద్రబాబు. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసే చంద్రబాబు.. రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఇక్కడ కూర్చొని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం దేనికి.. ఢిల్లీకి వచ్చి పోరాడాలని సూచించారు. చంద్రబాబుకు జేడీఎస్ తో ఇప్పటికే మంచి పరిచయాలు ఉన్నాయని గుర్తుచేశారు.. ఏపీలో మురికి కాల్వల్లో అవినీతి గురించి మాట్లడడానికే చంద్రబాబు పరిమితం కాకూడదు అంతూ హితవు పలికారు కేవీపీ రామచంద్రరావు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!