Gummanur Jayaram: స్థానిక ఎన్నికల తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేస్తా.. వాళ్లను నామినేషన్ వేయకుండా చేయాలి..!
- గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు..
- మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ మూసివేస్తారేమో..
- నేను మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gummanur Jayaram: మాజీ మంత్రి, గుంతకల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు అనంతపురం జిల్లా గుత్తి టీడీపీ పట్టణ, మండల కమిటీల ఏర్పాటుపై పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. మాట్లాడుతూ.. మన మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ మూసేసినా.. నేను మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను అని హెచ్చరించారు.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో టీడీపీ నాయకులపై ఎన్నో కేసులు బనాయించారు. కానీ, మనం మాత్రం.. కుళ్లు, కుతంత్రాల రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు.. అయితే, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.. రేపు రాబోయే ఎన్నికలలో ప్రతి కార్యకర్త కలిసిమెలిసిగా ఉండి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.. అంతేకాదు, స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లను నామినేషన్లు కూడా వేయకుండా చేయాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం..
Read Also: Nagarjuna: ఈ పాత్ర ఎలా ఒప్పుకున్నావ్ నాగ్?
Also Read
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
నన్ను రౌడీ అన్నారు.. కూనికోరు అన్నారు.. నేను రౌడీని కాదు.. నాది అందరినీ ప్రేమించే గుణం అన్నారు గుమ్మనూరు జయరాం.. కేసులే పెట్టాలి అనుకుంటే.. ఈ ఏడాది కాలంలో అందరిపై కేసులు పెట్టేవాళ్లం.. కానీ, మాకు అలాంటి వ్యవహారాలు చేయం అన్నారు.. అయితే, స్థానిక సంస్థల్లో పార్టీ పెట్టిన అందరు అభ్యర్థులను గెలుపించుకోవాల్సిన బాధ్యత మనది.. దయచేసి ఎవరి కాలు పట్టుకుని గుంజే ప్రయత్నం చేయొద్దు అన్నారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.. కాగా, ఇప్పటికే ఓ వైపు మంత్రి నారా లోకేష్ రెడ్బుక్పై ఆరోపణలు, విమర్శలు, కామెంట్లు వినపడుతోన్న వేళ.. ఇప్పుడు గుమ్మనూరు జయరాం కూడా తానూ రెడ్బుక్ ఓపెన్ చేస్తానని వ్యాఖ్యానించడం చర్చగా మారింది..
తాజావార్తలు
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
-
Layoffs: జాబ్స్కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
-
Pawan Kalyan: “రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా”.. తెలంగాణపై మరోసారి స్పందన.!
-
KTR: “తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా”.. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!