Minister TG Bharat: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి భరత్ కీలక వ్యాఖ్యలు..
- కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై మంత్రి భరత్ కీలక వ్యాఖ్యలు..
- హైకోర్టు బెంచ్ కోసం 25 నుండి 30 ఎకరాల స్థలం సేకరించాలి..
- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారన్న టీజీ భరత్..
Minister TG Bharat: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి భరత్ కీలక వ్యాఖ్యలు.. హైకోర్టు బెంచ్ కోసం కర్నూలులో 25 నుండి 30 ఎకరాల స్థలం సేకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు.. ఇక, ఏపీలో త్వరలో 14 వేల కోట్లతో సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు రానున్నాయన్నారు మంత్రి టీజీ భరత్. భారత్ లో మొదటిసారి సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు తీసుకువచ్చామన్నారాయన. ఈ పెట్టుబడులు యూపీకి వెళ్లకుండా ఏపీకి తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కృషి చేశామన్నారు టీజీ భరత్. రూ.14 వేల కోట్ల ప్రాజెక్టు కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారాయన. ఈ ప్రాజెక్టు రెండున్నరేళ్లలో పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు.. కర్నూలు జిల్లా ప్రజలకు ఇదొక పెద్ద క్రిస్మస్ కానుక అన్నారు మంత్రి భరత్.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
- Umrah Scam: ఉమ్రా యాత్ర పేరుతో రూ. 4 కోట్లు వసూలు చేసిన కేటుగాడు..!
- Sangameswara Temple: బయటపడ్డ సంగమేశ్వర ఆలయం.. ఆలయ చరిత్ర ఇదిగో..!
- CM Chandrababu: బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్తో తిరుమల లడ్డూ.. సీఎం సంచలన వ్యాఖ్యలు..
కాగా, కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇప్పటికే తీర్మానం చేసిన విషయం విదితమే.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నవంబర్ 21వ తేదీన ఈ తీర్మానాన్ని న్యాయ, న్యాయశాఖ మంత్రి ఎన్. ఎండి. ఫరూక్ ప్రవేశపెట్టగా.. ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ప్రకటించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇక, రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తూ, కర్నూలులో ఉన్న లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మరియు కొన్ని ట్రిబ్యునళ్లను ప్రభుత్వం మార్చదని పేర్కొన్న విషయం విదితమే..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో