Pawan Kalyan: పిన్నాపురం గ్రీన్కో సోలార్ పవర్ ప్రాజెక్టు పవర్ హౌస్ పరిశీలన..
- ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ప్రాజెక్ట్ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- వ్యవసాయానికి పనికిరాని భూముల్లోనే పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు
- ఇది భారీ ప్రాజెక్ట్
- చిన్నచిన్న తప్పులుంటే సరిదిద్దాలి
- ఏమైనా సమస్యలు ఇంటే కేబినెట్ దృష్టికి తీసుకెళ్తా -డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లా పిన్నాపురం వద్ద ఏర్పాటైన ప్రపంచంలోనే అతి పెద్దదైన పిన్నాపురం గ్రీన్కో సోలార్ పవర్ ప్రాజెక్టు పవర్ హౌస్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఇక్కడ ఒకే ప్రాంతంలో విండ్ పవర్, సౌర విద్యుత్, హైడల్ పవర్ యూనిట్స్ ఉన్నాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ప్రాజెక్టు విజిట్ చేశామని చెప్పారు. సోలార్, హైడల్, జల విద్యుత్.. పొల్యూషన్ లేని విద్యుత్ ఇక్కడ తయారవుతుందని అన్నారు. అనిల్ చలంశెట్టి, మహేష్ గ్రీన్ కో ప్రారంభించారని తెలిపారు. దేశంలో లక్షన్నర కోట్లు పెటుబడి పెట్టారు.. ఏపీలో రూ.30 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు.. మరో రూ.20 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. పిన్నపురంలో రూ.10 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు, ఇంకా 14 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు డిప్యూటీ సీఎం చెప్పారు.
Mahesh Babu : మార్షల్ ఆర్స్ట్ నేర్చుకునేందుకు చైనాకు వెళ్తున్న మహేష్ ?
Also Read
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
అటవీ నిబంధనలు ఉల్లగించారంటే చూడ్డానికి వచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు. 2800 ఎకరాల్లో 1700 ఎకరాలు కొన్నారు.. రాళ్లు రప్పలు ఉండి వ్యవసాయానికి పనికి రాని భూముల్లో ప్రాజెక్టు నిర్మిస్తున్నారన్నారు. చంద్రబాబు ఐటీ తరువాత గ్రీన్ ఎనర్జీ పై దృష్టి పెట్టారు.. అందులో భాగంగా పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. దేశానికి ప్రతిష్టాత్మకమైనది రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్టు అని అభిప్రాయపడ్డారు. దేశానికి రెండున్నర లక్షల పెట్టుబడులు తీసుకురాగలిగారు.. 365 ఎకరాలు కేంద్రం నుంచి అటవీ భూమి కొన్నారు, అందుకు కంపెనీ 365 ఎకరాల భూమి నెల్లూరు జిల్లాలో ఇచ్చారని వెల్లడించారు. 40 ఎకరాల భూమి ఫారెస్టు, రెవెన్యూ మధ్య వివాదం ఉంది.. దీన్ని పరిశీలించడానికి వచ్చానని చెప్పారు.
Congress : ఈనెల 27న తెలంగాణకు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ.
ఆఫీసులో కూర్చొని సమీక్షించడానికి, ఫీల్డ్కి వెళ్లి సమీక్షించడానికి తేడా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఇది భారీ ప్రాజెక్టు.. ఇందులో చిన్న చిన్న వయోలేషన్స్ ఉంటే కరెక్షన్ చేయాలని అధికారులకు సూచించారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే క్యాబినెట్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. పర్యాటక ప్రాంతంగా, ఎడ్యుకేషన్ టూర్ ప్లేస్గా అభివృద్ధికి అవకాశం ఉందన్నారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద యువతకు ఉపాధి కల్పించే పనులు, రైతులకు ప్రయోజనాలు కల్పించే పనులు యాజమాన్యం చేయాలని తెలిపారు. 43 లక్షల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు ఇవ్వగలిగెంత విద్యుత్ ఇక్కడ ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. కడప, చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఆక్రమణకు గురవుతున్నాయని.. అటవీశాఖ భూముల ఆక్రమణలపై రెవెన్యూ, అటవీ భూముల వివాదాలపై సమీక్ష చేస్తానని చెప్పారు. కర్నూలు అద్భుతమైన నగరం కావాలని తెలిపారు. అలాగే.. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్కు NIA సమన్లు
-
AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!