Mahesh Babu : మార్షల్ ఆర్స్ట్ నేర్చుకునేందుకు చైనాకు వెళ్తున్న మహేష్ ?
- సినిమా కోసం మహేష్ ను సానపెడుతున్న జక్కన్న మార్షల్ ఆర్స్ట్ కోసం చైనాకు వెళ్తున్న మహేష్ రెండు పార్టులుగా రాబోతున్న మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తను ప్రస్తుతం ఇండియాస్ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ ఎస్ ఎస్ ఎంబీ 29 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. అడ్వంచరస్ కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. దీంతో మహేష్ కొంత ట్రైనింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు రాజమౌళి అదేశాల మేరకు జపాన్ లో కొన్ని రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. . అటుపై ఆఫ్రికాలోని మసాయి-పిగ్మీస్ తెగల మధ్య బేసిక్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఓ 20 రోజుల పాటు ఆప్రికన్ తెగల మధ్య మహేష్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా మహేష్ చైనా దేశానికి కూడా వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాకి సంబంధించి కొంత మార్షల్ ఆర్స్ట్ పై కూడా బేసిక్ ట్రైనింగ్ అసవరమని భావించి దర్శకుడు రాజమౌళి భావించి మహేష్ ను చైనాకి పంపిస్తున్నాడుట. ఈనెల మిడ్ లోనే మహేష్ చైనా ప్రయాణం ఉంటుందట. అక్కడ స్పెషల్ ట్రైనర్ల ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇనిస్ట్యూట్ లో శిక్షణ ఉంటుందని వార్తలొస్తున్నాయి. మహేష్ తో పాటు రాజమౌళి కూడా అటెండ్ అవుతారని అంటున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే మార్షల్ ఆర్స్ట్ మాస్టర్లు ట్రైనింగ్ ఇవ్వనున్నారట.
Read Also:CM Chandrababu: గ్రీన్ ఎనర్జీ రూపంలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు..
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
ఇదే నిజమైతే మహేష్ ని జక్కన్న ఏ రేంజ్ లో సానబెడుతున్నాడో ఇక్కడే అర్దమవుతుంది. షూటింగ్ ప్రారంభానికి ముందే ఇన్ని రకాల ట్రైనింగ్ లు అంటే చిన్న విషయం కాదు. ఎంతో ఓపికతో పూర్తి చేయాల్సిన ట్రైనింగులు అవన్నీ కూడా. సినిమా కోసం మహేష్ ఏమాత్రం ఆలోచించరు. కాంప్రమైజ్ అయ్యేటు వంటి వ్యక్తి అసలే కాదు. జపాన్, మసాయి తెగల మధ్యనే గడిపిన మహేష్ చైనా ట్రైనింగ్ పూర్తి చేయలేడా అని అంటున్నారు ఆయన అభిమానులు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా అడ్వెంచర్ థ్రిల్లర్ కావడంతోనే ఇన్ని రకాల ట్రైనింగ్ లు అవసరం అవుతున్నాయి. మేజర్ పార్టు షూటింగ్ ఆప్రికన్ అడవుల్లోనే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అటు రామోజీ ఫిలిం సిటీ సహా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సైతం పెద్ద ఎత్తున సెట్లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. ఫస్ట్ పార్టు 2026లో రిలీజ్ కానుంది. ఆ తర్వాత సెకండ్ పార్ట్ 2029లో రాబోతుంది.
తాజావార్తలు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..