Mahesh Babu : మార్షల్ ఆర్స్ట్ నేర్చుకునేందుకు చైనాకు వెళ్తున్న మహేష్ ?
- సినిమా కోసం మహేష్ ను సానపెడుతున్న జక్కన్న మార్షల్ ఆర్స్ట్ కోసం చైనాకు వెళ్తున్న మహేష్ రెండు పార్టులుగా రాబోతున్న మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తను ప్రస్తుతం ఇండియాస్ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ ఎస్ ఎస్ ఎంబీ 29 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. అడ్వంచరస్ కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. దీంతో మహేష్ కొంత ట్రైనింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు రాజమౌళి అదేశాల మేరకు జపాన్ లో కొన్ని రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. . అటుపై ఆఫ్రికాలోని మసాయి-పిగ్మీస్ తెగల మధ్య బేసిక్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఓ 20 రోజుల పాటు ఆప్రికన్ తెగల మధ్య మహేష్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా మహేష్ చైనా దేశానికి కూడా వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాకి సంబంధించి కొంత మార్షల్ ఆర్స్ట్ పై కూడా బేసిక్ ట్రైనింగ్ అసవరమని భావించి దర్శకుడు రాజమౌళి భావించి మహేష్ ను చైనాకి పంపిస్తున్నాడుట. ఈనెల మిడ్ లోనే మహేష్ చైనా ప్రయాణం ఉంటుందట. అక్కడ స్పెషల్ ట్రైనర్ల ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇనిస్ట్యూట్ లో శిక్షణ ఉంటుందని వార్తలొస్తున్నాయి. మహేష్ తో పాటు రాజమౌళి కూడా అటెండ్ అవుతారని అంటున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే మార్షల్ ఆర్స్ట్ మాస్టర్లు ట్రైనింగ్ ఇవ్వనున్నారట.
Read Also:CM Chandrababu: గ్రీన్ ఎనర్జీ రూపంలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు..
Also Read
ఇదే నిజమైతే మహేష్ ని జక్కన్న ఏ రేంజ్ లో సానబెడుతున్నాడో ఇక్కడే అర్దమవుతుంది. షూటింగ్ ప్రారంభానికి ముందే ఇన్ని రకాల ట్రైనింగ్ లు అంటే చిన్న విషయం కాదు. ఎంతో ఓపికతో పూర్తి చేయాల్సిన ట్రైనింగులు అవన్నీ కూడా. సినిమా కోసం మహేష్ ఏమాత్రం ఆలోచించరు. కాంప్రమైజ్ అయ్యేటు వంటి వ్యక్తి అసలే కాదు. జపాన్, మసాయి తెగల మధ్యనే గడిపిన మహేష్ చైనా ట్రైనింగ్ పూర్తి చేయలేడా అని అంటున్నారు ఆయన అభిమానులు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా అడ్వెంచర్ థ్రిల్లర్ కావడంతోనే ఇన్ని రకాల ట్రైనింగ్ లు అవసరం అవుతున్నాయి. మేజర్ పార్టు షూటింగ్ ఆప్రికన్ అడవుల్లోనే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అటు రామోజీ ఫిలిం సిటీ సహా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సైతం పెద్ద ఎత్తున సెట్లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. ఫస్ట్ పార్టు 2026లో రిలీజ్ కానుంది. ఆ తర్వాత సెకండ్ పార్ట్ 2029లో రాబోతుంది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!