KS Jawahar : అప్పుడే విద్యారంగంపై జగన్ చిత్తశుద్ధేమిటో అర్థమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్ లాభాపేక్షకు విద్యారంగం నాశనమైందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు కేఎస్ జవహర్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీచర్లను లిక్కర్ షాపుల వద్ద నిలబెట్టినప్పుడే విద్యారంగంపై జగన్ చిత్తశుద్ధేమిటో అర్థమైందని ఆయన మండిపడ్డారు. నూతన విద్యావిధానం అంటూ ఎవరిని సంప్రదించి సీఎం నిర్ణయాలు తీసుకున్నారు..? అని ఆయన ప్రశ్నించారు.
మంత్రులంతా వేలి ముద్రగాళ్లు అవ్వబట్టే, రాష్ట్రంలో విద్య వ్యాపారాంశమైందని, చంద్రబాబు బడ్జెట్లో 15శాతం నిధులు విద్యకు కేటాయిస్తే, జగన్ వచ్చాక 10శాతం కూడా ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పిల్లలే విదేశాల్లో చదవాలా..? దళితులు చదవకూడదా? అని ఆయన అన్నారు. చంద్రబాబు ఎప్పటికప్పుడు డీఎస్సీతో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేశారని, జగన్ 3వేల పాఠశాలలు మూసేసి, 25 వేల ఉపాధ్యాయ ఖాళీల భర్తీని విస్మరించారన్నారు.
Also Read
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన జీతాన్ని వాలంటీర్లకిస్తూ, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, విద్య ద్వారా దళితులు అభివృద్ధి చెందడం ఈ సీఎంకు సుతరామూ ఇష్టం లేదని ఆయన ధ్వజమెత్తారు. నాడు-నేడుతో జగన్ సాధించింది పాఠశాలలకు రంగులద్దడమేనని, చంద్రబాబు పాఠశాలల్ని విద్యార్థులకు అందుబాటులో ఉంచితే, జగన్ గ్రామాలకు పాఠశాలల్ని దూరం చేశారన్నారు.
రాష్ట్రంలో 490కు పైగా మున్సిపల్ పాఠశాలల్ని ఎందుకు మూసేశారన్నారు. ఎయిడెడ్ పాఠశాలల్ని జగన్ రెడ్డి నిజంగానే డెడ్ చేశారని ఎద్దేవా చేశారు. అమ్మ ఒడిని బోగస్ గా మార్చారని, ఉపాధ్యాయ సంఘాలు పాఠశాలల్ని కాపాడుకోవడానికి రోడ్డెక్కాల్సిన సమయం వచ్చిందన్నారు.
తాజావార్తలు
-
Kapoor Family : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కపూర్ కూతురు.. ఇక్కడైనా హిట్ వస్తుందో లేదో
-
Vaibhav-BCCI: అప్పుడు నీతులు చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు!
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
-
President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!