Kothapalli Subbarayudu: వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా.. ఏ పార్టీ నుంచైనా కావొచ్చు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు.. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానంటున్న ఆయన.. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ అనేది కొద్ది రోజుల్లో తెలియజేస్తా అంటున్నారు.. అంతే కాదు.. తాను ఒక్క నియోజక వర్గానికి పరిమితం కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా నేను చేరే పార్టీకి మేలు జరిగేలా కృషి చేస్తానన్నారు. నేను గెలవడంతో పాటు మెజార్టీ సీట్లు సాధించేలా కృషి చేస్తానని ప్రకటించారు కొత్తపల్లి సుబ్బారాయుడు.. తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఆసక్తికర కామెంట్లు చేశారు.. ప్రతి ఏటా నా పుట్టిన రోజు ఘనంగా జరుగుతుంది.. బల ప్రదర్శన ప్రతి ఏటా ఉండేదే అన్నారు.
Read Also: MLA Ahmed Pasha Quadri: రాజాసింగ్ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని స్పీకర్కు లేఖ
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ఇక, తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయను అని ఎక్కడ చెప్పలేదన్నారు కొత్తపల్లి సుబ్బారాయుడు.. నియోజకవర్గం తరపున పెద్ద ఎత్తున తరలి వచ్చి శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.. కాగా, గతంలో తెలుగు దేశం పార్టీలో కీలకంగా పనిచేసిన ఆయన.. నర్సాపురం స్థానం నుంచి 1983 నుంచి 2014 వరకు పోటీ చేశారు.. అయితే, 2019 ఎన్నికల్లో మాత్రమే ఆయన పోటీకి దూరంగా ఉన్నారు.. అయితే, 2019లో ముదునూరి ప్రసాదరాజు ఎమ్మెల్యే విజయం సాధించారు.. అప్పటి నుంచి నరసాపురం నియోజకవర్గంలో ఇద్దరు నేతలకు పోసగడం లేదు అనేది బహిరంగ రహస్యమే.. అయితే, 2024 ఎన్నికల బరిలో ఉంటాను.. నర్సాపురం నుంచే పోటీ చేస్తానని.. ఏ పార్టీ తరపున పోటీ చేస్తానన్న విషయం మాత్రం చెప్పలేనని.. ఒకవేళ ఎవరూ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటానని గతంలోనూ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన చేసిన కామెంట్లు మాత్రం.. కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీకి బైబై చెప్పి.. మళ్లీ సైకిల్ ఎక్కుతారా? అనే చర్చకు తావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!