Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కింది స్థాయిలో అక్కడక్కడ కొన్ని విబేధాలు కనిపించినా.. ఆవి వెంటనే సమసిపోయేలా చర్యలు తీసుకున్నారు.. ఇక, రాష్ట్రస్థాయిలో అయితే.. ఎప్పుడూ తేడా కొట్టిందే లేదు.. ఈ నేపథ్యంలో.. నెల్లూరు పర్యటనలో మంత్రి నారా లోకేష్ కూటమి పార్టీల మధ్య సమన్వయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం బాగుందని, చిన్నచిన్న సమస్యలు తలెత్తితే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని తెలిపారు. ఇదే అంశంపై గతంలోనూ లోకేష్ కూటమి మూడు పర్యాయాలు కలిసి పోటీ చేస్తామని పేర్కొన్నారు..
కూటమి పార్టీల అధినేతలుగా తమ మధ్య ఎలాంటి సందేహాలు లేవని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.. ఏదైనా విషయంలో తనకు సందేహం వస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్కు నేరుగా ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పారు. పార్టీల మధ్య చిన్నచిన్న సమస్యలు ఉన్నా కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్, విడాకులు ఉండవు” అంటూ కూటమి కొనసాగింపుపై తన అభిప్రాయాన్ని లోకేష్ వ్యక్తం చేశారు. కూటమి భాగస్వాముల మధ్య సమన్వయం విషయంలో స్పష్టత ఉందని తెలిపారు.
Also Read
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలంటే కూటమి పార్టీలు మరో మూడు దఫాలు కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉందని లోకేష్ పేర్కొన్నారు. దీనిపై తమకు స్పష్టమైన అవగాహన ఉందని, కూటమి పార్టీల మధ్య కోఆర్డినేషన్ బాగుందని అన్నారు. నెల్లూరులో పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ లోకేష్ కూటమి కొనసాగింపుపై మాట్లాడారు. ఇక, 2029 ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వం కలిసి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, ఎన్నికల్లో గెలిస్తేనే ప్రజలకు మరింత సేవ చేయగలమని సూచించారు.. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఎన్డీఏ జెండా ఎగరాలని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ నూటికి నూరు శాతం విజయం సాధించేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు మంత్రి నారా లోకేష..
తాజావార్తలు
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్..
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!