Kodali Nani: ఆ గుట్టు తేలాలి.. మోడీకి, కేసీఆర్కి లేఖ రాస్తా
Kodali Nani To Write A Letter To Modi KCR On NTR Death: ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై విరుచుకుపడ్డారు. పాదయాత్ర చేయడం కన్నా.. ప్రశాంతంగా పడుకోవడమే లోకేష్కు ఇష్టమని ఎద్దేవా చేశారు. తన పాదయాత్రలో భాగంగా సీఎం జగన్పై లోకేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ లోకేష్కు మాట్లాడటం రాదు అని దుయ్యబట్టారు. పాదయాత్ర లోకేష్ ప్రతిరోజూ 10 కిలోమీటర్లు కూడా నడవడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పాదయాత్ర చేయలేక తన కొడుకు పంపాడని, జనం లేక లోకేష్ ఖాళీ కుర్చీలకు స్పీచ్లు ఇస్తున్నాడని పేర్కొన్నారు. నిబంధనలు పాటించమని చెప్తుంటే.. అనవసరంగా పోలీసులను తిడుతున్నాడని మండిపడ్డారు.
Kohli vs Rohit: కోహ్లీ, రోహిత్ మధ్య గొడవలు నిజమే: మాజీ కోచ్ శ్రీధర్
Also Read
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
నారావారి పల్లె నుంచి వలస వెళ్లిపోయింది చంద్రబాబేనని, దత్తపుత్రుడు కూడా హైదరాబాద్కు వలస వెళ్లిపోయాడని కొడాలి నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు దెబ్బకు లోకేష్ బాబాయ్ ఏమయ్యాడో తెలియడం లేదని, పండగకు నారావారిపల్లెలో నీ బాబాయ్ ఎందుకు కనపడడు? అని ప్రశ్నించారు. వివేకా హత్య జరిగినప్పుడు సీఎంగా చంద్రబాబే ఉన్నారని.. ఆరోజు చంద్రబాబు, కడప జిల్లా నేతలు పోలీసులతో ఏం మాట్లాడారని ప్రశ్నించారు. చంద్రబాబు ఫోన్ కాల్స్పై సీబీఐ విచారణ జరపాల్సిందిగా డిమాండ్ చేశారు. అప్పటి డీజీపీ, టీడీపీ నేతల ఫోన్ కాల్స్పై విచారణ చేయాల్సిందేనని కోరారు. కడపలో జిల్లాలో గంటా శ్రీనివాస్ను ఇన్ఛార్జ్గా పెట్టి, వివేకా ఓటమికి కారణమయ్యారని.. ఎన్నికల ముందు వివేకాను చంపి, కేసును సీఎం జగన్పై పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఒంటరిగా పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచారని, వివేకాను అక్కున చేర్చుకున్న హృదయం జగన్ది అని తెలిపారు.
Dadisetti Raja: యనమలకు దాడిశెట్టి సవాల్.. తమ్ముడితో ఆ పని చేయించగలవా?
కానీ.. చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్లాంటి మహానుభావుడిని వెన్నుపోటు పొడిచి, సీఎం పదవి లాక్కున్నారని కొడాలి నాని విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ వారసులు పార్టీలోకి వస్తుంటే, వారికి ఎందుకు గుండెపోట్లు వస్తున్నాయని నిలదీశారు. ఆరోజుల్లో హరికృష్ణ ఎంత డిమాండ్ చేసినా, ఎన్టీఆర్ మృతిపై విచారణ జరపలేదని.. అసలెందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ చనిపోతే పోస్ట్మార్టం కూడా చేయించలేదన్నారు. ఎన్టీఆర్ మరణం వెనుక ఏదో గుట్టు ఉందని, దాన్ని తేల్చాల్సిందేనని చెప్పారు. ఈ విషయంపై తాను ప్రధాని మోడీకి, తెలంగాణ సీఎం కేసీఆర్కు లేఖ రాస్తానని కొడాలి నాని పేర్కొన్నారు.
BRS Sangareddy : సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలో ముదురుతున్న అసమ్మతి పోరు
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!