Kiran Kumar Reddy: కాంగ్రెస్కి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా.. త్వరలోనే ఆ పార్టీలోకి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiran Kumar Reddy Resigns Congress Party: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపారు. ‘‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం నుంచి నా రాజీనామాను అంగీకరించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను’’ అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతే.. అంతకుమించి ఆ లేఖలో ఇంకేం రాయలేదు. తాను కాంగ్రెస్ని వీడడానికి గల కారణాల్ని సైతం వెల్లడించలేదు. ఇప్పుడు ఆయన పాదాలు ఎటువైపు? అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ వర్గాల్లో కిరణ్కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపినట్టు కూడా వార్తలొచ్చాయి.
Kottu Satyanarayana: పవన్కి సబ్జెక్ట్ లేదు.. దమ్ముంటే చర్చకి రమ్మని మంత్రి ఓపెన్ ఛాలెంజ్
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
దీనికితోడు.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఇటీవల కిరణ్కుమార్ రెడ్డిపై ప్రశంసలు కురిపించడం, ఆయన బీజేపీలో చేరుతారన్న వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇంతకీ సోము వీర్రాజు ఏం మాట్లాడారంటే.. ‘‘కిరణ్ కుమార్ ఎంతో చురుకైన నాయకుడు. ఆయన పార్టీలోకి వస్తే, మేము సముచిత ప్రాధాన్యం కల్పిస్తాం. కిరణ్ వంటి నేత వస్తే, ఏపీలో బీజేపీ మరింత బలోపేతం అవుతుంది’’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే.. కిరణ్కుమార్ రెడ్డి మాత్రం ఏ పార్టీలో చేరుతున్నారనే విషయంపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా.. 2014 వరకు యాక్టివ్గా ఉన్న ఆయన, ఆ తర్వాత తెరమరుగయ్యారు. ఇటీవల బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో మెరిసిన ఆయన.. అక్కడ కొన్ని రాజకీయ పరమైన అంశాలను ప్రస్తావించారు. ఆ వెంటనే మళ్లీ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ సడెన్గా తెరమీదకి వచ్చి, కాంగ్రెస్కి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
Harirama Jogaiah: జగన్ పోవాలి, పవన్ రావాలి.. ఇదే కాపు సంక్షేమ సేన లక్ష్యం
ఇదిలావుండగా.. కిరణ్కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన నేత. పీలేరు నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్సార్ ఆకస్మిక మరణం తర్వాత రోశయ్యను ముఖ్యమంత్రి చేయగా.. కొన్ని రోజుల్లోనే ఆయన తప్పుకోవడంతో, కిరణ్కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన వరకు ఆయన సీఎం పదవిలో కొనసాగారు. అంతే.. ఎన్నికలయ్యాక మళ్లీ ఎక్కడా కనిపించలేదు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!