Kiran Kumar Reddy: కాంగ్రెస్కి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా.. త్వరలోనే ఆ పార్టీలోకి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiran Kumar Reddy Resigns Congress Party: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపారు. ‘‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం నుంచి నా రాజీనామాను అంగీకరించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను’’ అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతే.. అంతకుమించి ఆ లేఖలో ఇంకేం రాయలేదు. తాను కాంగ్రెస్ని వీడడానికి గల కారణాల్ని సైతం వెల్లడించలేదు. ఇప్పుడు ఆయన పాదాలు ఎటువైపు? అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ వర్గాల్లో కిరణ్కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపినట్టు కూడా వార్తలొచ్చాయి.
Kottu Satyanarayana: పవన్కి సబ్జెక్ట్ లేదు.. దమ్ముంటే చర్చకి రమ్మని మంత్రి ఓపెన్ ఛాలెంజ్
Also Read
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్... మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
దీనికితోడు.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఇటీవల కిరణ్కుమార్ రెడ్డిపై ప్రశంసలు కురిపించడం, ఆయన బీజేపీలో చేరుతారన్న వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇంతకీ సోము వీర్రాజు ఏం మాట్లాడారంటే.. ‘‘కిరణ్ కుమార్ ఎంతో చురుకైన నాయకుడు. ఆయన పార్టీలోకి వస్తే, మేము సముచిత ప్రాధాన్యం కల్పిస్తాం. కిరణ్ వంటి నేత వస్తే, ఏపీలో బీజేపీ మరింత బలోపేతం అవుతుంది’’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే.. కిరణ్కుమార్ రెడ్డి మాత్రం ఏ పార్టీలో చేరుతున్నారనే విషయంపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా.. 2014 వరకు యాక్టివ్గా ఉన్న ఆయన, ఆ తర్వాత తెరమరుగయ్యారు. ఇటీవల బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో మెరిసిన ఆయన.. అక్కడ కొన్ని రాజకీయ పరమైన అంశాలను ప్రస్తావించారు. ఆ వెంటనే మళ్లీ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ సడెన్గా తెరమీదకి వచ్చి, కాంగ్రెస్కి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
Harirama Jogaiah: జగన్ పోవాలి, పవన్ రావాలి.. ఇదే కాపు సంక్షేమ సేన లక్ష్యం
ఇదిలావుండగా.. కిరణ్కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన నేత. పీలేరు నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్సార్ ఆకస్మిక మరణం తర్వాత రోశయ్యను ముఖ్యమంత్రి చేయగా.. కొన్ని రోజుల్లోనే ఆయన తప్పుకోవడంతో, కిరణ్కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన వరకు ఆయన సీఎం పదవిలో కొనసాగారు. అంతే.. ఎన్నికలయ్యాక మళ్లీ ఎక్కడా కనిపించలేదు.
తాజావార్తలు
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!