Kiran Kumar Reddy: కాంగ్రెస్కి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా.. త్వరలోనే ఆ పార్టీలోకి?
Kiran Kumar Reddy Resigns Congress Party: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపారు. ‘‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం నుంచి నా రాజీనామాను అంగీకరించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను’’ అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతే.. అంతకుమించి ఆ లేఖలో ఇంకేం రాయలేదు. తాను కాంగ్రెస్ని వీడడానికి గల కారణాల్ని సైతం వెల్లడించలేదు. ఇప్పుడు ఆయన పాదాలు ఎటువైపు? అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ వర్గాల్లో కిరణ్కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపినట్టు కూడా వార్తలొచ్చాయి.
Kottu Satyanarayana: పవన్కి సబ్జెక్ట్ లేదు.. దమ్ముంటే చర్చకి రమ్మని మంత్రి ఓపెన్ ఛాలెంజ్
Also Read
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
దీనికితోడు.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఇటీవల కిరణ్కుమార్ రెడ్డిపై ప్రశంసలు కురిపించడం, ఆయన బీజేపీలో చేరుతారన్న వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇంతకీ సోము వీర్రాజు ఏం మాట్లాడారంటే.. ‘‘కిరణ్ కుమార్ ఎంతో చురుకైన నాయకుడు. ఆయన పార్టీలోకి వస్తే, మేము సముచిత ప్రాధాన్యం కల్పిస్తాం. కిరణ్ వంటి నేత వస్తే, ఏపీలో బీజేపీ మరింత బలోపేతం అవుతుంది’’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే.. కిరణ్కుమార్ రెడ్డి మాత్రం ఏ పార్టీలో చేరుతున్నారనే విషయంపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా.. 2014 వరకు యాక్టివ్గా ఉన్న ఆయన, ఆ తర్వాత తెరమరుగయ్యారు. ఇటీవల బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో మెరిసిన ఆయన.. అక్కడ కొన్ని రాజకీయ పరమైన అంశాలను ప్రస్తావించారు. ఆ వెంటనే మళ్లీ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ సడెన్గా తెరమీదకి వచ్చి, కాంగ్రెస్కి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
Harirama Jogaiah: జగన్ పోవాలి, పవన్ రావాలి.. ఇదే కాపు సంక్షేమ సేన లక్ష్యం
ఇదిలావుండగా.. కిరణ్కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన నేత. పీలేరు నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్సార్ ఆకస్మిక మరణం తర్వాత రోశయ్యను ముఖ్యమంత్రి చేయగా.. కొన్ని రోజుల్లోనే ఆయన తప్పుకోవడంతో, కిరణ్కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన వరకు ఆయన సీఎం పదవిలో కొనసాగారు. అంతే.. ఎన్నికలయ్యాక మళ్లీ ఎక్కడా కనిపించలేదు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?