Mla KethiReddy Padayatra: ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాదయాత్ర.. హారతులిచ్చిన జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం కాసేపల్లిలో ప్రజా సంక్షేమ యాత్ర భాగంగా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాదయాత్ర చేపట్టారు. ప్రజా సంక్షేమం కోసం తాడిపత్రి నియోజకవర్గం లోని పెద్దవడుగూరు మండలంలో అన్ని గ్రామాలలో 11 రోజుల పాటు ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాదయాత్ర చేపట్టారు ఇందులో భాగంగా మొదటి రోజు కాసేపల్లి, గుత్తి అనంతపురం కొత్తపల్లివిరుపాపురం, ఆవులంపల్లె వరకు పాదయాత్ర సాగింది .ఆయన పాదయాత్రలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఆయనకు పూలు చల్లుతూ మహిళలు హారతులు ఇచ్చారు. పాదయాత్రలో ప్రజల వద్ద నుంచి సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించారు.
Read Also: Boyfriend Crime: మరో వ్యక్తితో పెళ్లి.. గొంతు కోసిన ప్రియుడు
Also Read
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
అనంతరం ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అన్ని గ్రామాల్లో పర్యటించడం జరిగిందన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవాలని వారికి మరింత సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రజా సంక్షేమ యాత్రను చేపట్టడం జరిగిందన్నారు. పెద్దవడుగూరు మండలంలో 11 రోజులపాటు అన్ని గ్రామాలలో పాదయాత్ర తర్వాత యాడికి మండలంలో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. పాదయాత్ర చేయడం అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, మేము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించడమే నా పాదయాత్ర ముఖ్య కారణం. గత ఎన్నికలలో పెద్దవడుగూరు మండలం మా పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చింది. వచ్చే ఎన్నికలలో పెద్ద వడుగురు మండలంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నాం.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాల కుల మతాలకు అతీతంగా అందరు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని ఆయన తెలియజేశారు. ప్రతిపక్షంలో ఉంటేనే పాదయాత్ర చేస్తావన్నమాట కు సమాధానం ఇస్తూ అధికారంలో ఉంటే పాదయాత్ర చేయకూడదా అని సమాధానం ఇచ్చారు. ప్రజలకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతోనే వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
తాజావార్తలు
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!