Kethireddy Peddareddy: జేసీ కుటుంబానికి పెద్దారెడ్డి సవాల్.. అది నిరూపించగలరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kethireddy Peddareddy Challenges JC Family: తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ కుటుంబానికి మధ్య రాజకీయ వివాదం రోజురోజుకీ ముదురుతూనే ఉంది. ఒకరిపై మరొకరు తారాస్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటూనే ఉన్నారు. ఒకరికి మరొకరు సవాళ్లు కూడా విసురుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా జేపీ ఫ్యామిలీకి పెద్దారెడ్డి ఓ సవాల్ విసిరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక.. తాడిపత్రి నియోజకవర్గంలోని డ్యామ్లను నింపి, రెండు పంటలకు నీళ్లు అందిస్తున్నామని పెద్దారెడ్డి తెలిపారు. కానీ.. గత 35 ఏళ్లలో జేసీ కుటుంబం ఏనాడూ ఈ పని చేయలేదని, చేసినట్లు వాళ్లు నిరూపించగలరా? అని ఛాలెంజ్ చేశారు.
Virender Sehwag: అతనిపై పెట్టుకున్న ఆశలన్నీ బుగ్గిపాలు చేశాడు.. తీసిపారెయ్యండి
Also Read
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
కేవలం డ్యామ్లు నిర్మిస్తే సరిపోదని.. వాటిని నీటితో నింపాలని పెద్దారెడ్డి సూచించారు. గ్రామాల్లో గొడవలు పెరగకుండా, అలాగే ఫ్యాక్షనిజం తగ్గించడానికి తాను పాదయాత్ర చేస్తున్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాడిపత్రి నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని.. దానికి కారణం సీఎం జగన్ అని తెలిపారు. గతంలో కంటే ఇప్పుడు గొడవలు చాలా తగ్గాయని, నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్కు ఎంక్వైరీ చేసినా ఆ విషయం తెలుస్తుందని అన్నారు. ఫ్యాక్షన్ గొడవలు ఉండొద్దని సీఎం జగన్ తమకు గట్టిగా చెప్పారని, ఆయన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నామని చెప్పారు. అలాగే.. తన పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకొని, అక్కడే ఉన్న అధికారులతో చర్చించి, వాటిని పరిష్కరిస్తున్నట్లు పెద్దారెడ్డి వెల్లడించారు.
Seediri Appalaraju: జగన్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారు.. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన అరిష్టం
అంతకుముందు కూడా.. అస్మిత్ పుట్టినరోజు సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి డ్యాన్స్ చేయడాన్ని ఉద్దేశిస్తూ, 73 ఏళ్ల వయసులో జేసీకి డాన్స్ చేయడం అవసరమా అంటూ పెద్దారెడ్డి ఎద్దేవా చేశారు. ఒకప్పుడు తాడిపత్రిలో రౌడీయిజం చేసిన జేసీ.. ఇప్పుడు డాన్సులు చేసుకునే పరిస్థితికి దిగజారారని వ్యంగ్యంగా విమర్శించారు. ఎవరి ఇంట్లోనైనా వేడుకలు ఉంటే చాలు.. అక్కడికి వెళ్లి డాన్స్ చేసే స్థితికి జేసీ వచ్చారంటూ సెటైర్లు వేశారు.
తాజావార్తలు
-
Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
-
Telangana : IFS అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.!
-
EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్లపై కంప్లీట్ బ్యాన్!
-
Nabha Natesh : శాకాహారులుగా మారిపోయాం!.. నభా నటేష్ సెన్సేషనల్ కామెంట్స్!
-
Arrears Release: బకాయిల క్లియరెన్స్.. తెలంగాణ ఉద్యోగులకు ఊరట!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!