Srisailam Temple Rush: ముక్కంటి క్షేత్రంలో భక్తుల సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరమ పవిత్రమయిన కార్తీక మాసం త్వరలో ముగియనుంది.దీంతో ఇవాళ శ్రీశైల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోతోంది. శ్రీగిరి మల్లన్న ఆలయం ముక్కంటీశుని దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. కార్తీక దీపాలు వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు భక్తులు. శ్రీశైలంలో కార్తీకమాసం నాలుగోవ చివరి సోమవారం కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జును స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా శ్రీశైలం తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పట్టే అవకాశముంది.
భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి వేకువజాము నుంచే కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద,ఉత్తర శివమాఢవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ముందస్తు ఆలోచనతో మల్లన్న భక్తులకు ఆది,సోమ,పౌర్ణమి,ఏకాదశి రోజులలో అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. అలంకార దర్శనం ఏర్పాటు వలన త్వరగతిన దర్శనాలు పూర్తవుతున్నాయి. 23 వ తేదీతో కార్తీక మసోత్సవాలు ముగియనున్నాయి.
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
Read Also:FIFA World Cup 2022: కేరళ, కోల్కతాలను ఊపేస్తున్న సాకర్ ఫీవర్.. ఎక్కడ చూసినా కటౌట్లే..
అలానే నేటి సాయంత్రం కార్తీక పౌర్ణమి మూడవ సోమవారం సందర్భంగా ప్రధానాలయ ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి కృష్ణమ్మకు నది హారతి వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం వుండడంతో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 12 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80,294 మంది భక్తులు. తలనీలాలు సమర్పించారు 31,554 మంది భక్తులు…ఆదివారం హుండీ ఆదాయం రూ.4.48 కోట్లు అని టీటీడీ తెలిపింది. ఆఖరి కార్తీక సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలాడుతున్నాయి శ్రీకాళహస్తి,కపీలతీర్దం ఆలయాలు.. దర్శనాలు, అభిషేకాలు కోసం భారీ క్యూ లైన్ లు వున్నాయి. తిరుపతిలో వేడుకగా జరుగుతున్నాయి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. పెద్దశేష వాహనంపై తిరుమాఢ వీధుల్లో వివరిస్తున్నారు పద్మావతి అమ్మవారు. రాత్రి హంస వాహనం సేవ నిర్వహించనున్నారు.
Read Also: Convicts Escape : అచ్చం సినిమాల్లో లాగే పక్కా ప్లాన్ వేశారు.. ఎస్కేప్ అయ్యారు
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!