Pendem Dorababu: ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతూనే ఉన్నాయి.. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో.. వైసీపీకి భారీ షాక్ తగలబోతోందట.. వైసీపీకి గుడ్బై చెప్పే యోచనలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఉన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.. దీనిపై తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారట పెండెం దొరబాబు.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు సీటు ఇవ్వకపోయినా పర్వాలేదు.. కానీ, తన స్థానం నుంచి పోటీ చేసి వంగా గీత.. తనను అవమానించిందని తన ముఖ్యఅనుచరుల దగ్గర దొరబాబు వ్యాఖ్యానించినట్టుగా ప్రచారం సాగుతోంది.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని వాస్తవాలు తెలుసుకోనివ్వకుండా చుట్టూ ఉన్న కోటరి పని చేస్తుందని కామెంట్ చేశారట దొరబాబు..
Read Also: Jagdeep Dhankhar: అది కోచింగ్ కాదు..వ్యాపారం..సభలో రాజ్యసభ ఛైర్మన్ ఆగ్రహం
మొత్తంగా వైసీపీకి గుడ్బై చెప్పేందుకు పెండెం దొరబాబు రెడీ అయినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. జనసేన పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారట మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. కాగా, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగిన అప్పటి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగా గీతపై సంచలన విజయం సాధించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏకంగా 70 వేలకు పైగా మెజారిటీతో పిఠాపురంలో జనసేన జెండాను పవన్ కల్యాణ్ ఎగురవేసిన విషయం విదితమే. ఇక, స్థానికంగా నివాసం కూడా నిర్మించుకోవడానికి సిద్ధమైన పవన్ కల్యాణ్.. దీనికోసం భూమి కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.