Jagdeep Dhankhar: అది కోచింగ్ కాదు..వ్యాపారం..సభలో రాజ్యసభ ఛైర్మన్ ఆగ్రహం
- దేశ రాజధానిలో దిగ్భ్రాంతకర ఘటన
- వర్షం నీటిలో ముగ్గురు విద్యార్థుల జల సమాధి
- ఈ అంశం ఉభయసభల్లో చర్చ
- కోచింగ్ సెంటర్లపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధానిలో దిగ్భ్రాంతకర ఘటన చోటు చేసుకుంది. ఐఏఎస్ కావాలని కలలు గన్న ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఢిల్లీలోని ఓ ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో భవనం బేస్మెంట్లో నీటిలో చిక్కుకుని జల సమాధి అయ్యారు. వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయితే తాజాగా ఈ అంశం ఉభయసభల్లో ప్రస్తావనకు వచ్చింది. దీనిపై రాజ్యసభలో చర్చ జరగగానే.. ఛైర్మన్ జగదీప్ ధంఖర్ కూడా వ్యాఖ్యానించారు. నేడు కోచింగ్ వ్యాపారంగా మారిందని మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. “కోచింగ్ అనేది నేడు ఒక రకమైన వ్యాపారంగా మారింది. మనం తరచుగా వార్తాపత్రికలను చూసినప్పుడు మొదటి లేదా రెండు పేజీలలో వాటి ప్రకటనలు భారీగా కనిపిస్తాయి.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Ganja In Metro: బరితెగించారు.. ఏకంగా మెట్రోలోనే గంజాయి తాగుతున్న వ్యక్తి..
Also Read
పార్లమెంట్ లో ప్రస్తావన..
ఈరోజు లోక్సభలో న్యూఢిల్లీ ఎంపీ బన్సూరి స్వరాజ్ రాజేంద్ర నగర్ కోచింగ్ ప్రమాదాన్ని తీవ్రంగా లేవనెత్తారు. కోచింగ్ ప్రమాదంపై విచారణ కమిటీ వేయాలని ఆప్ ప్రభుత్వంపై బన్సూరి స్వరాజ్ మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని.. ఢిల్లీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని బన్సూరి స్వరాజ్ ఆరోపించారు. మరోవైపు కన్నౌజ్ ఎంపీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ఢిల్లీలో జరిగిన ఈ ప్రమాదంపై ప్రశ్నించారు. ఇప్పటి వరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అఖిలేష్ యాదవ్ అడిగారు. ఈ ఘటన బాధాకరమని, ఇలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లపై ప్రభుత్వం బుల్డోజర్లను నడుపుతుందా? అని నిలదీశారు.
తాజావార్తలు
-
Story Board : పంజా విసురుతున్న ఎల్నినో.. ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం..
-
USA: “నువ్వు ముస్లింవా?” అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
-
India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
-
Tragedy: దమ్ముంటే హైదరాబాద్కు రమ్మన్నాడు.. నిజంగానే వచ్చి చంపేశారు.. ఏం జరిగిందంటే..
-
Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!