Pithapuram: పిఠాపురంలో ఆసక్తికరణ పరిణామాలు.. మళ్లీ జనసేన వర్సెస్ టీడీపీ..!
- పిఠాపురంలో ఆసక్తికర పరిణామాలు..
- అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పదవిని జనసేనకు..
- వైస్ చైర్మన్ పదవిని టీడీపీకి కేటాయిస్తూ ఒప్పందం..
- మూడు చోట్ల జనసేన విజయం.. ఒక స్థానానికి టీడీపీ పరిమితం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్లుగా జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎన్నుకున్నారు.. అయితే, ఎన్నికలకు ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం.. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పదవిని జనసేనకు.. వైస్ చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు.. అయితే, ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు మూడు చోట్ల పోటీ చేస్తే మూడు చోట్ల విజయం సాధించగా.. టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట మాత్రమే గెలిచారు.. ఇదే ఇప్పుడు చర్చగా మారింది..
Read Also: Israel Army Chief: హమాస్ దాడిని నిలువరించడంలో తాము ఫెయిల్ అయ్యాం..
Also Read
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
- MLC Anantha Babu Arrest: బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..
టీడీపీ అభ్యర్థిపై ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.. ఇక, ఆ తర్వాత జనసేనకు మద్దతు ఇచ్చారు ఇండిపెండెంట్ అభ్యర్థి… కానీ, జనసేన పొత్తు ధర్మం పాటించలేదని.. అందుకే ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచాడని టీడీపీ ఆరోపణలు చేస్తుంది.. మరోవైపు.. పోటీ చేసిన రెండో వార్డులో టీడీపీ రెబల్ ను ఎందుకు ఎంకరేజ్ చేశారని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు.. ఇండిపెండెంట్ గా గెలిచిన రాంబాబు.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు అనుచరుడుగా చెబుతున్నారు.. అయితే, ఈ పరిణామాలు మరోసారి పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీగా మారాయనే చర్చ సాగుతోంది.. ఎందుకంటే..? ఈ ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి తప్పుకున్నా.. కూటిమిలోని టీడీపీ-జనసేన పార్టీలే పోటాపోటీగా బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యారు.. అయితే, టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోక్యంతో.. మంత్రి నిమ్మల రామానాయుడు అక్కడి నేతలతో మాట్లాడి ఒప్పందం చేసి సయోధ్య కుదిర్చిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!