Former Minister Daissetty Raja: జనసేన వైపు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చూపు..!? క్లారిటీ ఇచ్చిన వైసీపీ నేత
- జనసేన వైపు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చూపు..!?
- రాజా జనసేనలో చేరతారని ప్రచారం..
- తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన మాజీ మంత్రి..
- అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని వైసీపీ నేతలకు విజ్ఞప్తి..
Former Minister Daissetty Raja: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లమీద షాక్లు తగులుతున్నాయి.. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు, మాజీ మంత్రులు, కీలక నేతలు.. పార్టీకి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకోగా.. మరికొందరు జనసేనలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. ఈ రోజు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య సహా పలువురు కీలక నేతలు జనసేన గూటికి చేరబోతున్నారు.. మరోవైపు.. వైసీపీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చూపు ఇప్పుడు జనసేన వైపు అంటూ ప్రచారం సాగుతోంది.. దీంతో.. త్వరలోనే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.. వైసీపీకి రాజీనామా చేస్తారని.. ఆ తర్వాత జనసేనలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది.. దీనిపై క్లారిటీ ఇచ్చారు దాడిశెట్టి రాజా..
Read Also: Black Magic: క్షుద్ర పూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు
Also Read
- MLC Anantha Babu Arrest: బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..
- Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
- TDP vs Janasena Clash: పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన.. మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్..
- Fishing Ban: సముద్రంలో వేట నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా, బోటు సీజ్..
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.. తాను జనసేనలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తన అభిమానులకు సూచించారు.. ప్రస్తుతం తాను ఆరోగ్యరీత్యా హైదరాబాద్లో ఉన్నానని.. త్వరలోనే అందరినీ కలుస్తానని ప్రకటించారు.. ”వైసీపీ కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారాలు.. నేను తునిలో లేని సమయంలో నేను జనసేన వైపు చూస్తున్నట్టు ఫేక్ న్యూస్ సృష్టించారు.. ఆ ఫేక్ న్యూస్ మా పార్టీ నాయకులు, కార్యకర్తల మనస్సు నొప్పించాయి.. ఇలాంటి కథనాలతో అపోహలు కల్పించాలని చూస్తున్నారు.. అయితే, మొదటి నుంచి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని న ఆ వెన్నంటే ఉండి.. ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగానూ.. అధికారపక్షంలో మంత్రిగానూ నా ఉన్నతికి సహకరించిన మిమ్మల్ని గానీ.. మన నాయకులు జగన్మోహన్రెడ్డి గారిని కానీ నేడే వీడి వెలతానని.. ఎవ్వరు చెప్పినా నమ్మవద్దు.. అనారోగ్యం రీత్యా టెస్ట్ల కోసం హైదరాబాద్లో ఉన్నారు.. తుని వచ్చిన వెంటనే అందరినీ కలుస్తాను అంటూ.. వైసీపీ తుని వాట్సాప్ గ్రూప్లో ఓ పోస్టు పెట్టారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా..
తాజావార్తలు
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
-
Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?