Former Minister Daissetty Raja: జనసేన వైపు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చూపు..!? క్లారిటీ ఇచ్చిన వైసీపీ నేత
- జనసేన వైపు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చూపు..!?
- రాజా జనసేనలో చేరతారని ప్రచారం..
- తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన మాజీ మంత్రి..
- అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని వైసీపీ నేతలకు విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former Minister Daissetty Raja: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లమీద షాక్లు తగులుతున్నాయి.. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు, మాజీ మంత్రులు, కీలక నేతలు.. పార్టీకి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకోగా.. మరికొందరు జనసేనలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. ఈ రోజు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య సహా పలువురు కీలక నేతలు జనసేన గూటికి చేరబోతున్నారు.. మరోవైపు.. వైసీపీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చూపు ఇప్పుడు జనసేన వైపు అంటూ ప్రచారం సాగుతోంది.. దీంతో.. త్వరలోనే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.. వైసీపీకి రాజీనామా చేస్తారని.. ఆ తర్వాత జనసేనలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది.. దీనిపై క్లారిటీ ఇచ్చారు దాడిశెట్టి రాజా..
Read Also: Black Magic: క్షుద్ర పూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు
Also Read
- MP Uday Srinivas: 'జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం'.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.. తాను జనసేనలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తన అభిమానులకు సూచించారు.. ప్రస్తుతం తాను ఆరోగ్యరీత్యా హైదరాబాద్లో ఉన్నానని.. త్వరలోనే అందరినీ కలుస్తానని ప్రకటించారు.. ”వైసీపీ కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారాలు.. నేను తునిలో లేని సమయంలో నేను జనసేన వైపు చూస్తున్నట్టు ఫేక్ న్యూస్ సృష్టించారు.. ఆ ఫేక్ న్యూస్ మా పార్టీ నాయకులు, కార్యకర్తల మనస్సు నొప్పించాయి.. ఇలాంటి కథనాలతో అపోహలు కల్పించాలని చూస్తున్నారు.. అయితే, మొదటి నుంచి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని న ఆ వెన్నంటే ఉండి.. ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగానూ.. అధికారపక్షంలో మంత్రిగానూ నా ఉన్నతికి సహకరించిన మిమ్మల్ని గానీ.. మన నాయకులు జగన్మోహన్రెడ్డి గారిని కానీ నేడే వీడి వెలతానని.. ఎవ్వరు చెప్పినా నమ్మవద్దు.. అనారోగ్యం రీత్యా టెస్ట్ల కోసం హైదరాబాద్లో ఉన్నారు.. తుని వచ్చిన వెంటనే అందరినీ కలుస్తాను అంటూ.. వైసీపీ తుని వాట్సాప్ గ్రూప్లో ఓ పోస్టు పెట్టారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా..
తాజావార్తలు
-
AAA Cinemas: విశాఖలో అల్లు అర్జున్ ‘AAA’ సినిమాస్.. 8 స్క్రీన్లతో ప్రీమియం మూవీ ఎక్స్పీరియెన్స్కు సిద్ధం!
-
Vaibhav Sooryavanshi: ఏమో ఎవరికి తెలుసు.. వైభవ్ సూర్యవంశీ బలహీనతను అతడు కనిపెట్టామేమో!
-
108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
-
ZombieReddy2 : బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో సైలెంట్ గా స్టార్ట్ అయిన జాంబీరెడ్డి – 2
-
Petrol, Diesel Prices Reduced: ఇది కదా కావాల్సింది.. పెట్రోల్ ధరలు లీటరు రూ. 5, డీజిల్ ధరలు రూ. 3 తగ్గింపు
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!