CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: కాకినాడ జిల్లా తుని పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తుని నియోజకవర్గ ప్రజలు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన యనమల దివ్యకు మంచి మన్ననలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఒకప్పుడు తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేదని, అయితే యనమల రామకృష్ణుడు ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైన తర్వాత నియోజకవర్గం కొంత వెనుకబడిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే ఉద్దేశంతో పొత్తుల అవసరాన్ని ముందుగానే గుర్తించి ప్రకటించిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని చంద్రబాబు అన్నారు. రెండేళ్ల క్రితం ఇదే నెల 12వ తేదీన తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. పవన్ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నారని తెలిపారు.
సంక్షేమ పథకాలపై మాట్లాడుతూ, కేవలం బటన్ నొక్కడం ద్వారా నిధులు పంపిణీ చేయడంలో ఒక రకమైన ఆనందం ఉంటుందని అన్నారు చంద్రబాబు. మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించేందుకు 33 శాతం సీట్లను కేటాయించి వారిని నాయకత్వ స్థానాలకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్య రంగంలో సంస్కరణలపై స్పందిస్తూ, ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా “సంజీవని” ప్రాజెక్టును అమలు చేస్తామని తెలిపారు. అలాగే ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత డాక్టర్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నానికి రైల్వే జోన్ సాధించామని చెప్పారు. సమాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లపై స్పందించిన సీఎం, చాలామంది టెలివిజన్ సీరియల్స్ చూసి అనవసర టెన్షన్లు తెచ్చుకుంటున్నారని అన్నారు. సెల్ఫోన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని 2047 నాటికి దేశానికి ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
Also Read
- Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
- MP Uday Srinivas: 'జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం'.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు, విధ్వంసక రాజకీయాలు చేసే వారిని “గొడ్డలి పార్టీ”గా అభివర్ణించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తావిస్తూ పలు ఆరోపణలు చేశారు. అలాగే గతంలో కోడికత్తి, గులకరాయి వంటి ఘటనలతో రాజకీయ డ్రామాలు సృష్టించారని విమర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎవరూ ఆపలేరని ఘాటుగా హెచ్చరించారు.. నేను పవన్ రాష్ట్రాన్ని పైకి తీసుకుపోవడం.. గొడ్డలి పార్టీ కింద పడేయడం.. వైకుంఠపాలి వద్దు అని సూచించారు..
డీఎస్సీ నియామకాల అంశంపై మాట్లాడుతూ, గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు చంద్రబాబు.. తమ ప్రభుత్వం డీఎస్సీని పారదర్శకంగా నిర్వహిస్తోందని, ఇందుకోసం 40 వేల ప్రశ్నలు, 25 ప్రశ్నాపత్రాలు సిద్ధం చేశామని తెలిపారు. అయినప్పటికీ డీఎస్సీపై అనవసర అనుమానాలు సృష్టించి రాష్ట్రంలో అభద్రతా భావాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. తిరుమల, ఇతర ప్రాంతాల్లో కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించిన సీఎం, కొన్ని ఘటనలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. నంద్యాలలో వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో కూడా ప్రతిపక్ష కార్యకర్తలే పాత్రధారులని పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై మాట్లాడుతూ, విశాఖపట్నం, అమరావతి, తిరుపతిని మూడు ప్రధాన రీజియన్లుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు సీఎం.. రైతులు తమ పంటలను ఎగుమతి చేసుకునే అవకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, ఆక్వా రంగానికి ఉన్న లాజిస్టిక్ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మహిళలకు త్వరలో ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం తెలిపారు. తుని ప్రజల సంతృప్తి సూచీలో ప్రస్తుతం రాష్ట్రంలో 91వ స్థానంలో ఉందని, గతంలో ఇది 61వ స్థానంలో ఉండేదని చెప్పారు. తుని అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు.
రెవెన్యూ శాఖలో త్వరలో సమగ్ర ప్రక్షాళన చేపడతామని, ప్రజల రెవెన్యూ సమస్యలను వచ్చే మార్చి నాటికి పరిష్కరించే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. త్వరలో గ్రామాలకు ఆకస్మికంగా పర్యటించి, అధికారులతో కలిసి బస్సులో ప్రజల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలను నేరుగా తెలుసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!