Jogi Ramesh: నా కొడుకుపై తప్పుడు కేసులు పెట్టి పాలకులు ఆనందపడుతున్నారు..
- మంగళగిరిలో ముగిసిన జోగి రమేష్ పోలీస్ విచారణ..
- నా కొడుకుపై తప్పుడు కేసులు పెట్టి పాలకులు ఆనంద పడుతున్నారు..
- రాజకీయ కోపం ఉంటే తనపై తీర్చుకోవాలి.. పిల్లల జోలికి వెళ్లడం సరికాదు..
- అనుమానాలుంటే చంద్రబాబు
- పవన్ దగ్గరకు వెళ్లి వివరణ ఇస్తా: జోగి రమేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: మంగళగిరిలో మాజీ మంత్రి జోగి రమేష్ పోలీసు విచారణ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు అప్పటి సీఎం జగన్ పై అసభ్య పదజాలంతో తిట్టారు.. అందుకే నేను చంద్రబాబు దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేయాలని వెళ్లాను.. నిరసన తెలుపుతున్న నాపై దాడి చేసారు.. రాజకీయాల్లో విలువలు, విశ్వస నీయత అవసరం.. ప్రజలు మంచి విజయాన్ని ఇచ్చారు.. పాలకులు కక్షపూరిత వాతావరణంలో రాజకీయాలు చేస్తే ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు అని ఆయన పేర్కొన్నారు. వివాదాస్పద భూములు కొనాలని ఎవరూ అనుకోరు.. అభం శుభం తెలియని నా కొడుకుపై తప్పుడు కేసులు పెట్టి ఆనంద పడుతున్నారు అంటూ మాజీ మంత్రి జోగి రమేశ్ వెల్లడించారు.
Also Read
ఇక, రాజకీయ కోపాలు ఉంటే నా మీద తీర్చుకోండి అని జోగి రమేశ్ పేర్కొన్నారు. పిల్లలు జోలికి వెళ్ళడం సరి కాదు.. మీకు అనుమానాలు ఉంటే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల దగ్గరకు వచ్చి అనుమానాలు తీరుస్తా.. అంతేకాని రెడ్ బుక్ రాజ్యాంగం అవసరం లేదు.. 2002 నుంచి నేను ఒకే నంబరు వాడుతున్నా.. పోలీసులు అడిగిన ఏ సమాచారం అయినా ఇస్తా.. పరుష పదజాలం వాడిన మా పరిస్థితి ఏమయ్యిందో.. ఇప్పటి పాలకుల పరిస్థితి అదే అవుతుంది అని మాజీ మంత్రి జోగి రమేశ్ వెల్లడించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..