Loan Apps, Accidents Awarness: జంగారెడ్డిగూడెంలో లోన్ యాప్స్, ప్రమాదాలపై అవగాహన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ వేధింపులు పెరిగిపోతున్నాయి. అమాయకులు లోన్ యాప్ ల మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈనేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తం అయింది. ఏలూరు జిల్లా ఎస్.పి. రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు జిల్లా లో లోన్ యాప్ లు, ఆక్సిడెంట్ లపై ప్రజలకు అవగాహన కల్పించాలని అందులో భాగంగా సచివాలయ మహిళా పోలీసులకు(GMSK) లకు అవగాహన కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం డి.ఎస్.పి. కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి. సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో దిశ యాప్ మెగా డౌన్ లోడ్ కార్యక్రమం జరుగుతోందన్నారు.
దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం వలన మహిళలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా అక్కడికి సమీపంలో వున్న పోలీసులు వారికి అందుబాటులోకి వస్తారన్నారు. మహిళలకు సరైన సలహాలు, సూచనలు ఇచ్చి సహకరిస్తున్నారని డీఎస్పీ తెలిపారు. ఇదే సమయంలో అందరూ ఆండ్రాయిడ్ ఫోన్ లు వాడడం వలన అనేక నకిలీ లోన్ యాప్ లు డౌన్ లోడ్ అయ్యి ప్రజలను అప్పుల పేరుతో ఉచ్చులోకి లాగుతున్నాయన్నారు. ప్రజలు లోన్ యాప్ ల ద్వారా అప్పు తీసుకుని అవి తీర్చలేక ఆత్మ హత్యల వరకూ పరిస్థితి వెళ్తోందనన్నారు.
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- Pawan Kalyan : పవన్ ఫోకస్తో పెదపెంకికి కొత్త జీవం
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
Read Also:
Ram Gopal Varma: ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ కంటే కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్
ఇలాంటి ఫేక్ లోన్ యాప్ ల నుండి అప్పులు తీసుకుని ముప్పు కొని తెచ్చుకోవద్దని సూచించారు. అలాగే చిట్ ఫండ్ లలో డబ్బులు కట్టేటప్పుడు అనధికారిక చిట్ ఫండ్ లలో డబ్బులు పెట్టి వాటిని పోగొట్టుకుంటున్నారని కాబట్టి అనధికారిక చిట్ ఫండ్ లకు, కాల్ మనీ వ్యాపారులకు ప్రజలు దూరంగా వుండాలని డి.ఎస్.పి. సత్యనారాయణ అన్నారు. అలాగే జంగారెడ్డిగూడెం డివిజన్ లో ఇటీవల అనేక రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లాలో ఆక్సిడెంట్ లు జరిగినప్పుడు చనిపోయిన వారిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే వుంటున్నారన్నారు.
ప్రమాదం జరిగినప్పుడు వారు హెల్మెట్ ధరించక పోవడం వలన ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారని డి.ఎస్.పి. సత్యనారాయణ అన్నారు. ఇక నుండి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అందుకు సచివాలయ మహిళా పోలీసులు ప్రజలను చైతన్యవంతులను చేయడంలో భాగం కావాలని అన్నారు. అలాగే సచివాలయ మహిళా పోలీసులు బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. గ్రామాలలో ఏచిన్న సంఘటన జరిగినా వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్ కు సమాచారం ఇచ్చి సహకరిస్తున్నారని డి.ఎస్.పి. సచివాలయ మహిళా పోలీసులను ఆభినందించారు.
తాజావార్తలు
-
Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
-
India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
-
Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!