JanaSena: మంత్రి రోజా ఇంటి ముందు తొడగొట్టిన జనసేన నేతలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి రోజా ఇంటి సమీపంలోని రోడ్డుపై తొడగొట్టారు జనసేన నేతలు.. మంత్రి రోజాపై చేసినా అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. అయితే, అరెస్ట్ చేసిన కిరణ్ రాయల్ను నగరి కోర్టులో హాజరు పర్చారు పోలీసులు.. కోర్టులో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది… 41ఏ నోటీసు కిరణ్ రాయల్ను బెయిల్పై విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఇక, ఆ తర్వాత బెయిల్పై విడుదలైన తర్వాత ర్యాలీ నిర్వహించారు జనసేన నేతలు.. ఓవైపు వర్షం కురుస్తున్నా.. కాసేపు ర్యాలీగా వెళ్లారు.. ఆ తర్వాత మంత్రి రోజా ఇంటి వద్ద ఆగి తొడకొట్టారు జనసేన నేతలు.. తొడగొట్టినవారిలో కిరణ్ రాయల్.. పసుపులేటి హరిప్రసాద్.. ఇతర జనసేన నేతలు ఉన్నారు.
Read Also: Twitter Blue tick : వెనక్కి తగ్గిన ఎలాన్ మస్క్..! ట్విట్టర్ బ్లూ టిక్పై యూటర్న్..!
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కాగా, తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. మంత్రి రోజాపై కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్టు చేశామని నగరి పోలీసులు తెలిపారు… ప్రధాని మోడీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ సమయంలో జనసేన నేత కిరణ్ రాయల్ అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ ఆక్షేపించింది.. వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా కిరణ్ ను అరెస్టు చేశారని ఆరోపించారు. అయితే, మంత్రి రోజా విశాఖ ఎయిర్ పోర్టులో జబర్దస్త్ షో చేశారని, వైసీపీ ఏర్పాటు చేసిన రౌడీలే గంజాయి, మద్యం సేవించి మంత్రులపై దాడికి పాల్పడ్డారంటూ.. కిరణ్ రాయల్ గతంలో వ్యాఖ్యానించారు.. పవన్ ను టచ్ చేసే దమ్ము, ధైర్యం వైసీపీకి లేదని.. దమ్ముంటే పవన్ ని టచ్ చేసి చూడండి అంటూ సవాల్ కూడా విసిరారు. వైసీపీ నేతలే విశాఖ గర్జన పేరుతో సభ పెట్టారని, విశాఖలో పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం మూడు నెలల ముందే ఖరారైందన్నారు. పనికిరాని మంత్రులు పవన్ పై అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. అంతేకాదు, రోజా తమిళనాడులో పెళ్లి చేసుకున్నారని, అక్కడ రాజధాని పెట్టుకోవాలని కూడా ఎద్దేవా చేశారు.. మంత్రి రోజాకి విశాఖలో ఏం జరిగిందో తెలిసింది కదా, ఇంకోసారి పవన్ పై ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చిన విషం విదితమే.
తాజావార్తలు
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
-
Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
-
AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
-
OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్బ్యాక్ దక్కిందా?
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!