JanaSena: మంత్రి రోజా ఇంటి ముందు తొడగొట్టిన జనసేన నేతలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి రోజా ఇంటి సమీపంలోని రోడ్డుపై తొడగొట్టారు జనసేన నేతలు.. మంత్రి రోజాపై చేసినా అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. అయితే, అరెస్ట్ చేసిన కిరణ్ రాయల్ను నగరి కోర్టులో హాజరు పర్చారు పోలీసులు.. కోర్టులో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది… 41ఏ నోటీసు కిరణ్ రాయల్ను బెయిల్పై విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఇక, ఆ తర్వాత బెయిల్పై విడుదలైన తర్వాత ర్యాలీ నిర్వహించారు జనసేన నేతలు.. ఓవైపు వర్షం కురుస్తున్నా.. కాసేపు ర్యాలీగా వెళ్లారు.. ఆ తర్వాత మంత్రి రోజా ఇంటి వద్ద ఆగి తొడకొట్టారు జనసేన నేతలు.. తొడగొట్టినవారిలో కిరణ్ రాయల్.. పసుపులేటి హరిప్రసాద్.. ఇతర జనసేన నేతలు ఉన్నారు.
Read Also: Twitter Blue tick : వెనక్కి తగ్గిన ఎలాన్ మస్క్..! ట్విట్టర్ బ్లూ టిక్పై యూటర్న్..!
Also Read
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
కాగా, తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. మంత్రి రోజాపై కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్టు చేశామని నగరి పోలీసులు తెలిపారు… ప్రధాని మోడీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ సమయంలో జనసేన నేత కిరణ్ రాయల్ అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ ఆక్షేపించింది.. వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా కిరణ్ ను అరెస్టు చేశారని ఆరోపించారు. అయితే, మంత్రి రోజా విశాఖ ఎయిర్ పోర్టులో జబర్దస్త్ షో చేశారని, వైసీపీ ఏర్పాటు చేసిన రౌడీలే గంజాయి, మద్యం సేవించి మంత్రులపై దాడికి పాల్పడ్డారంటూ.. కిరణ్ రాయల్ గతంలో వ్యాఖ్యానించారు.. పవన్ ను టచ్ చేసే దమ్ము, ధైర్యం వైసీపీకి లేదని.. దమ్ముంటే పవన్ ని టచ్ చేసి చూడండి అంటూ సవాల్ కూడా విసిరారు. వైసీపీ నేతలే విశాఖ గర్జన పేరుతో సభ పెట్టారని, విశాఖలో పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం మూడు నెలల ముందే ఖరారైందన్నారు. పనికిరాని మంత్రులు పవన్ పై అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. అంతేకాదు, రోజా తమిళనాడులో పెళ్లి చేసుకున్నారని, అక్కడ రాజధాని పెట్టుకోవాలని కూడా ఎద్దేవా చేశారు.. మంత్రి రోజాకి విశాఖలో ఏం జరిగిందో తెలిసింది కదా, ఇంకోసారి పవన్ పై ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చిన విషం విదితమే.
తాజావార్తలు
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..