Nadendla Manohar: పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. సాగనంపడం ఖాయం..
Nadendla Manohar: పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. ఎన్నికల్లో ప్రజలు సాగనంపడం ఖాయం అని హెచ్చరించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. జనసేన కార్యాలయంలో సత్తెనపల్లి గంగమ్మకు ఆర్ధిక సాయం అందించిన నాదెండ్ల మనోహార్.. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబుపై ధ్వజమెత్తారు.. రూ. 5 లక్షల నష్టపరిహారం చెక్ ఇవ్వకుండా మంత్రి అంబటి అడ్డుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి.. ఇప్పటికీ నష్టపరిహరం ఇవ్వలేదంటూ విమర్శించారు.. దీంతో, బాధితురాలు గంగమ్మకు జనసేన తరపున ఆర్థిక సాయం చేస్తున్నామని వెల్లడించారు.. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దారుణాలు, దాడులు పెరిగాయని విమర్శించారు. జనసేన ఏ కార్యక్రమం చేపట్టినా ఆటంకాలు కలిగిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల నుంచి పార్టీ సభల వరకూ ఆంక్షలే అని మండిపడ్డారు.
Read Also: INDvsAUS 2nd Test: ఖవాజా ఫిఫ్టీ.. లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ 94/3
Also Read
- YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
గంగమ్మ కుమారుడు సెప్టిక్ ట్యాంకులో పడి ప్రాణాలు కోల్పోయాడు.. మంత్రి అంబటి రాంబాబు బయటకు రాకుండా పంచాయతి చేశారని.. సీఎం సహాయ నిధి నుంచి సాయం అందిస్తామని వివాదం కాకుండా జాగ్రత్త పడ్డారని విమర్శించారు నాదెండ్ల మనోహర్.. రూ. 5 లక్షలు మంజూరైతే.. అందులో సగం తమకు ఇవ్వాలని అంబటి హెచ్చరించాడని ఆరోపించారు.. దీంతో మమ్మల్ని కలిసి అంబటి బెదిరింపులను ధైర్యంగా చెప్పారు. ఆ సభలో మా అధినేత వైసీపీ దాష్టికాలను ప్రశ్నించారు. అంబటి రాంబాబు అవినీతిని నిలదీశారు.. నా తప్పును నిరూపించండని అంబటి రాంబాబు సవాల్ ను జనసేన స్వీకరించిందన్నారు.. బాధితురాలు గంగమ్మకు అండగా నిలబడి అంబటి అవినీతిని బయట పెట్టామని ప్రకటించారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా గంగమ్మ ధైర్యంగా నిలబడ్డారు.. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక పేద మహిళను ఇబ్బందులు పెట్టారని ఫైర్ అయ్యారు. చివరికి రూ. 5 లక్షల చెక్ ఆమెకు ఇవ్వకుండా వెనక్కి పంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్తెనపల్లి ప్రజల ఓట్లతో గెలిచి ఆ ప్రజల పైనే ప్రతీకారమా..? మీ కక్షలతో పేదల జీవితాలతో ఆడుకుంటారా..? చెక్ కనిపించడం లేదని అధికారులు కూడా డ్రామాలు ఆడతారా? చేతికి వచ్చిన కొడుకు చనిపోతే ఆ తల్లి మీద కనీస జాలి లేదా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. సాగనంపడం ఖాయమని హెచ్చరించిన ఆయన.. ఎన్ని ప్రయత్నాలు చేసినా అంబటి రాంబాబు అధికారం అండతో డబ్బులు రాకుండా చేశారని.. అక్క, చెల్లెళ్లు అని చెప్పే సీఎం జగన్కి చిత్తశుద్ధి ఉంటే అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తల్లికి జరిగిన అన్యాయంపై జనసేన మానవత్వంతో స్పందించింది. మా వంతుగా నాలుగు లక్షల రూపాయలు గంగమ్మకు అంద చేశాం. సవాల్ చేసిన అంబటి రాంబాబు రాజీనామా చేసి మాట మీద నిలబడాలంటూ తాజాగా సవాల్ విసిరారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
-
Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!