Janasena Kiran Royal : దానిపై వైవీ సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీటీడీ పాలక మండలి సమావేశంలో కొన్ని వ్యాపార లావాదేవీలు బయట పడ్డాయని తిరుపతి అసెంబ్లీ జనసేన పార్టీ ఇంఛార్జీ కిరణ్ రాయల్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. టీటీడీలో పెద్దలు వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ఏమనుకుంటే అది జరుగుతాయా…? ఈ విషయాలు అన్ని ఎస్వీబీసీ లైవ్ ద్వారా బయటకు వచ్చాయని ఆయన అన్నారు. ఉదయస్తమాన సేవా టికెట్లను సినిమా టికెట్లు తరహాలో పాలక మండలి సభ్యులు వాటలేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. లైవ్ ద్వారా అందరూ చూడాలని టీటీడీ అదనపు ఈవో ధర్మా రెడ్డి ఈ వీడియో బయట పెట్టించారన్నారు. శ్రీవారి ఉదయస్తమాన టికెట్లు 76 వరకు భక్తులు బుక్ చేసుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారని, ఇంతకీ టికెట్లు ఎవరు బుక్ చేసుకున్నారో సీబీఐ ద్వారా ఎంక్వయిరి జరగాలన్నారు.
ఇవన్నీ లైవ్ ద్వారా తెలిసేలా చేసిన అదనపు ఈవో ధర్మారెడ్డికి జనసేన నాయకులం ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సమాధానం చెప్తారా లేక మాకు నోటీస్ ఇస్తారా, టీటీడీ అధికారులు ఆలోచించుకోవాలి…ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. నిన్నటి రోజు బయోమెట్రిక్ ద్వారా ముగ్గురు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించారు. బయోమెట్రిక్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన వాళ్ళు ఎవరు? దీనిపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించలేని పాలకమండలి అవసరమా…? అని ఆయన ప్రశ్నించారు. పాలకమండలి సమావేశంలో ఎవరెవరు ఎంత వాటాలు తీసుకున్నారో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
తాజావార్తలు
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్పై యోగి బుల్డోజర్ యాక్షన్..
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
-
CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!