Janasena: ఇవాళ రెండోవిడత జనవాణి కార్యక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు జనసేన పార్టీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. దీనికి జనవాణి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ రెండోవిడత జనసేన జనవాణి భరోసా కార్యక్రమం జరగనుంది.సమస్యలపై ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించనున్నారు జనసేన అధినత పవన్ కళ్యాణ్. గత ఆదివారం 427 అర్జీలు అందించారు ప్రజలు. ఆయా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళతామని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసేలా టీంను ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. మొదటిసారి నిర్వహించిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయవాడ, ఒంగోలు నుంచి ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివస్తారని నాదెండ్ల అంటున్నారు. నేతలు అధికారంలో ఉంటేనే సమస్యలు పరిష్కారం చేస్తామంటే కుదరదని పవన్ ఇంతకుముందే ప్రకటించారు. తమకు పదవి లేకపోయినా సమాజంలో ఇబ్బందులపై దృష్టి సారించి పరిష్కరిస్తామని పవన్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో వుంటుంది.
ఇవాళ మరోసారి అర్జీలు తీసుకుని అధికారులకు పంపనున్నారు పవన్ కళ్యాణ్. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మూడు గంటల వరకు జనవాణి కార్యక్రమం వుంటుందని జనసేన కార్యాలయం వెల్లడించింది. ఈరోజు కూడా జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటారు పవన్. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ ఇవాళ ఏకాదశి సందర్భంగా గుంటూరు జిల్లాలోని నంబూరు దశావతార వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఏకాదశి సందర్భంగా ఈ ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కు ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం అందచేశారు.
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
Janasena Party: జనవాణి కార్యక్రమానికి భారీ స్పందన.. అర్జీలు స్వీకరించిన పవన్
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!