Janasena: ఇవాళ రెండోవిడత జనవాణి కార్యక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు జనసేన పార్టీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. దీనికి జనవాణి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ రెండోవిడత జనసేన జనవాణి భరోసా కార్యక్రమం జరగనుంది.సమస్యలపై ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించనున్నారు జనసేన అధినత పవన్ కళ్యాణ్. గత ఆదివారం 427 అర్జీలు అందించారు ప్రజలు. ఆయా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళతామని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసేలా టీంను ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. మొదటిసారి నిర్వహించిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయవాడ, ఒంగోలు నుంచి ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివస్తారని నాదెండ్ల అంటున్నారు. నేతలు అధికారంలో ఉంటేనే సమస్యలు పరిష్కారం చేస్తామంటే కుదరదని పవన్ ఇంతకుముందే ప్రకటించారు. తమకు పదవి లేకపోయినా సమాజంలో ఇబ్బందులపై దృష్టి సారించి పరిష్కరిస్తామని పవన్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో వుంటుంది.
ఇవాళ మరోసారి అర్జీలు తీసుకుని అధికారులకు పంపనున్నారు పవన్ కళ్యాణ్. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మూడు గంటల వరకు జనవాణి కార్యక్రమం వుంటుందని జనసేన కార్యాలయం వెల్లడించింది. ఈరోజు కూడా జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటారు పవన్. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ ఇవాళ ఏకాదశి సందర్భంగా గుంటూరు జిల్లాలోని నంబూరు దశావతార వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఏకాదశి సందర్భంగా ఈ ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కు ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం అందచేశారు.
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
Janasena Party: జనవాణి కార్యక్రమానికి భారీ స్పందన.. అర్జీలు స్వీకరించిన పవన్
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!