Janasena: ఇవాళ రెండోవిడత జనవాణి కార్యక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు జనసేన పార్టీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. దీనికి జనవాణి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ రెండోవిడత జనసేన జనవాణి భరోసా కార్యక్రమం జరగనుంది.సమస్యలపై ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించనున్నారు జనసేన అధినత పవన్ కళ్యాణ్. గత ఆదివారం 427 అర్జీలు అందించారు ప్రజలు. ఆయా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళతామని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసేలా టీంను ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. మొదటిసారి నిర్వహించిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయవాడ, ఒంగోలు నుంచి ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివస్తారని నాదెండ్ల అంటున్నారు. నేతలు అధికారంలో ఉంటేనే సమస్యలు పరిష్కారం చేస్తామంటే కుదరదని పవన్ ఇంతకుముందే ప్రకటించారు. తమకు పదవి లేకపోయినా సమాజంలో ఇబ్బందులపై దృష్టి సారించి పరిష్కరిస్తామని పవన్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో వుంటుంది.
ఇవాళ మరోసారి అర్జీలు తీసుకుని అధికారులకు పంపనున్నారు పవన్ కళ్యాణ్. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మూడు గంటల వరకు జనవాణి కార్యక్రమం వుంటుందని జనసేన కార్యాలయం వెల్లడించింది. ఈరోజు కూడా జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటారు పవన్. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ ఇవాళ ఏకాదశి సందర్భంగా గుంటూరు జిల్లాలోని నంబూరు దశావతార వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఏకాదశి సందర్భంగా ఈ ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కు ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం అందచేశారు.
Also Read
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
- Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
- Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
Janasena Party: జనవాణి కార్యక్రమానికి భారీ స్పందన.. అర్జీలు స్వీకరించిన పవన్
తాజావార్తలు
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
ట్రెండింగ్
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!