Pawan Kalyan: దేశంలో మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చి దిద్దుతా..
Pawan Kalyan: పిఠాపురంలో పోటీ చేయాలని కలలో కూడా అనుకోలేదని.. సమస్యలు నావి అనుకున్నాను తప్ప నియోజకవర్గం గురించి ఆలోచించలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురంలో లక్ష మెజారిటీ గెలిపిస్తా అన్నారని.. ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రం మొత్తం తిరిగే తాను పిఠాపురాన్ని వదిలేస్తా అనుకోవద్దన్నారు. పొత్తు ధర్మంలో జనసేనని గెలిపించే బాధ్యతను తీసుకున్న టీడీపీ కోఆర్డినేటర్ వర్మకి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ఫ్యాన్కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ అని ఎద్దేవా చేశారు. పిఠాపురంలో నిర్వహించిన ‘వారాహి విజయభేరి’ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఓడిపోయినా దశాబ్ధ కాలం నుంచి ఒంటరిగా పోరాటం చేస్తున్నానన్నారు. దయచేసి తనను గెలిపించాలని, ప్రజల ఆశీర్వాదం తనకు కావాలన్నారు. తనను గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తానన్నారు.
Read Also: Andhra Pradesh: వాలంటీర్ల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు
Also Read
- AP Mobile Alert: మొబైల్లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
- Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
పిఠాపురంకు మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ తీసుకువస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పిఠాపురం అభివృద్ధికి 12 నుంచి 14 పాయింట్స్ ఫార్ములా ఉందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ మీకు జవాబుదారీతనమని, తాను పారిపోయే వ్యక్తిని కానన్నారు. తనను ఓడించడానికి చిత్తూరు నుంచి మిధున్ రెడ్డి వచ్చాడన్నారు. పట్టుమని 25 మంది ఎమ్మెల్యేలు నిలబెట్టలేని తాను అంటే ఎందుకు కక్ష అంటూ ఆయన ప్రశ్నించారు. మండలానికి ఒక నాయకుడు ఎందుకు వచ్చాడని.. కాకినాడ మాఫియా డాన్ నన్ను ఓడిస్తాడా అంటూ ఎద్దేవా చేశారు. పిఠాపురంలో ఇల్లు తీసుకుంటానని, ఇక్కడే ఉంటానని పవన్ పేర్కొన్నారు. దేశంలో మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చి దిద్దుతానన్నారు. 54 గ్రామాలు ప్రజలు సమస్యలు పరిష్కారం కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. ఒక ఎన్నికలకి కాదు.. గుండెల్లో పెట్టుకోవడానికి పిఠాపురం వచ్చానన్నారు. పిఠాపురంలో 20 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తానన్నారు.
తాను ప్రభుత్వ ఉద్యోగి కొడుకునని.. జగన్లా సీఎం కొడుకును కాదన్నారు. మిధున్ రెడ్డి 60 నియోజకవర్గాలలో దోచేసిన డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నాడని ఆయన ఆరోపించారు. సజ్జల, పెద్దిరెడ్డి, జగన్ అందరూ పేద వారే.. ఒక్క ఎమ్మెల్యే కూడా లేని తాను పెత్తందారీనా అంటూ ప్రశ్నించారు. ఆలయాలు ధ్వంసం చేసిన ఎంత మందిని పట్టుకున్నారని వంగా గీతను అడగండి అంటూ ప్రజలను కోరారు. తాను గెలిచిన తర్వాత కాకినాడ మాఫియా డాన్ను పిఠాపురం రమ్మను.. తాటాకు చప్పుళ్ళకి భయపడను తోలు తీస్తానని హెచ్చరించారు. కాకినాడ పోర్టులో ఎన్నికల ఖర్చుకి డబ్బులు కంటైనర్లలో పెట్టారని ఆయన ఆరోపణలు చేశారు. కాకినాడ పోర్ట్ డ్రగ్ మాఫియా, బియ్యం మాఫియా, ఆయిల్ మాఫియాకి కేంద్రంగా మారిందన్నారు.
తాజావార్తలు
-
PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్కు డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
-
AP Mobile Alert: మొబైల్లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
-
Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
-
Palakura Ullikaram Recipe : పాలకూర ఉల్లికారం.. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే రుచి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!