Jairam Ramesh: కాంగ్రెస్కు ‘భారత్ జోడో యాత్ర’ సంజీవని..
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అపూర్వ స్పందన వస్తుంది.. కాంగ్రెస్కు భారత్ జోడో యాత్ర సంజీవని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్.. తమిళనాడు, కేరళను దాటి ప్రస్తుతం కర్ణాటకలో పాదయాత్ర సాగుతుండగా.. రెండు రోజులు బ్రేక్ ఇచ్చారు.. అయితే, కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది భారత్ జోడో యాత్ర.. దీంతో, కాంగ్రెస్ నేతలు పాదయాత్ర ఏర్పాట్లలో మునిగిపోయారు.. అందులో భాగంగా కర్నూలులో పర్యటించారు జైరాం రమేష్.. మీడియాతో మాట్లాడిన ఆయన.. 18న కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి రాహుల్ పాదయాత్ర చేరుకుంటుందన్నారు. 85 కిలోమీటర్ల మేర ఏపీలో రాహుల్ యాత్ర కొనసాగుతుంది… నాలుగు రోజుల పాటు రోజుకు 21 కిలోమీటర్ల మేర ఏపీలో యాత్ర సాగనుందని.. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణకు వెళ్తుందని వెల్లడించారు. తమిళనాడు 3 రోజులు, 18 రోజులు కేరళ, 21 రోజులు కర్ణాటకలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.
Read Also: Venkaiah Naidu: ఏపీ రోడ్ల పరిస్ధితి దారుణం.. వాటిపై దృష్టి పెట్టండి..!
Also Read
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
ఇక, బీజేపీ, మిత్రపక్షాలు భారత్ జోడో యాత్రపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు జైరాం రమేష్… 3,570 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేస్తారు.. 120 మంది భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు… అందులో మూడో వంతు మహిళలు వున్నారని తెలిపారు.. మరోవైపు, ఆండ్రాయిడ్ లో భారత్ జోడో యాత్ర యాప్ ఉందని.. డౌన్ లోడ్ చేసుకుంటే భారత్ జోడో నిత్యం లైవ్ చూడొచ్చు అని ప్రకటించారు.. ఇక, తెలుగులో భారత్ జోడో థీమ్ పాట 18న విడుదల చేస్తాం అన్నారు. ఆర్థిక అసమానత పెరగడం, కుల,మత, బాషా, సామాజిక విభజన, రాజకీయ కేంద్రీకృతం.. వీటికి వ్యతిరేకంగా భారత్ జోడో కొనసాగుతుందన్న ఆయన.. బీజేపీ రాజ్యాంగాన్ని బలహీనం చేసింది.. ఇప్పుడు, ఆర్ఎస్ఎస్, బీజేపీ భారత్ జోడో యాత్రలో ప్రజల స్పందనను చూసి భయపడుతున్నాయన్నారు.. కాంగ్రెస్ కు భారత్ జోడో యాత్ర సంజీవనిగా అభివర్ణించిన ఆయన.. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ బలపడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు జైరాం రమేష్.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?