Jagan New Cabinet: అసంతృప్తులు.. నినాదాలు.. నిరసనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కొత్త కేబినెట్ కూర్పు కొలిక్కి వచ్చినట్టే అని భావిస్తున్నారు. అయితే మంత్రి పదవిని ఆశించినవారు తీవ్ర నిరాశకు, అసంతృప్తికి గురవుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ఱారెడ్డి వెళ్లారు. ఆయనతో కలిసి మాట్లాడారు. పదవులు రానివారికి బుజ్జగింపుల పర్వం మొదలయ్యిందని అంటున్నారు.
బాలినేని నివాసంలో ఎక్కడా సందడి కనిపించడంలేదు. పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు బాలినేని నివాసం దగ్గరకు చేరుకుంటున్నారు. కొంత మంది కార్యకర్తలు గేటు బయటే పడిగాపులు పడుతున్నారు. బాలినేనిని బుజ్జగించటానికి వచ్చిన సజ్జల.. కేవలం పది నిమిషాలు మాత్రమే ఉండి తిరుగు పయనం అవడం చర్చకు దారితీస్తోంది. ఇదిలా వుంటే.. బాలినేని నివాసానికి వచ్చిన ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
నేను సజ్జల ను కలవటానికే ఇక్కడికి వచ్చాను. నాకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నాను. నేను సీనియర్ను. నాకు మంత్రి పదవి రావాల్సిందేనన్నారు.మరో వైపు లోపలికి ఎవరినీ అనుమతించక పోవడంతో నేతలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. మంత్రి ఏం నిర్ణయం తీసుకున్నా పాటిస్తాం అంటున్నారు మరికొందరు నేతలు. బాలినేని నివాసం దగ్గర కార్యకర్తల నినాదాలతో హోరెత్తిపోతోంది. బాలినేనికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని నినాదాలు చేశారు కార్యకర్తలు.
నాకు ఇంకా ఫోన్ కాల్ రాలేదన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మంత్రి వర్గంలో 10 మంది పాత వారికి 15 మంది కొత్త వారికి అవకాశం వుంటుందన్నారు. నాకు పదవి వచ్చినా….రాకపోయినా సీఎం జగన్ ఆదేశాలు మేరకు పనిచేస్తాను. అనంతరం విజయవాడకు బయలుదేరి వెళ్ళారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
మరోవైపు మంత్రి వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం విజయవాడ బయలు దేరారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకి కార్యకర్తలు ఆల్ దిబెస్ట్ చెప్పడం కనిపించింది. ఆయన ఉత్సాహంగా కార్యకర్తలతో సెల్ఫీలు దిగడం విశేషం.

Dharmana Prasada rao
మంత్రి పదవికి సంబంధించి తమకు ఇంకా ఫోన్ రాలేదని అంటున్నారు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, కొండేటి చిట్టిబాబు,దాడిశెట్టి రాజా. అధిష్ఠానం నుండి ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యేలు. ఫోన్ వస్తే బయలుదేరి వెళతాం అంటున్నారు.
తాజావార్తలు
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..