Jagan New Cabinet: అసంతృప్తులు.. నినాదాలు.. నిరసనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కొత్త కేబినెట్ కూర్పు కొలిక్కి వచ్చినట్టే అని భావిస్తున్నారు. అయితే మంత్రి పదవిని ఆశించినవారు తీవ్ర నిరాశకు, అసంతృప్తికి గురవుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ఱారెడ్డి వెళ్లారు. ఆయనతో కలిసి మాట్లాడారు. పదవులు రానివారికి బుజ్జగింపుల పర్వం మొదలయ్యిందని అంటున్నారు.
బాలినేని నివాసంలో ఎక్కడా సందడి కనిపించడంలేదు. పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు బాలినేని నివాసం దగ్గరకు చేరుకుంటున్నారు. కొంత మంది కార్యకర్తలు గేటు బయటే పడిగాపులు పడుతున్నారు. బాలినేనిని బుజ్జగించటానికి వచ్చిన సజ్జల.. కేవలం పది నిమిషాలు మాత్రమే ఉండి తిరుగు పయనం అవడం చర్చకు దారితీస్తోంది. ఇదిలా వుంటే.. బాలినేని నివాసానికి వచ్చిన ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
నేను సజ్జల ను కలవటానికే ఇక్కడికి వచ్చాను. నాకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నాను. నేను సీనియర్ను. నాకు మంత్రి పదవి రావాల్సిందేనన్నారు.మరో వైపు లోపలికి ఎవరినీ అనుమతించక పోవడంతో నేతలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. మంత్రి ఏం నిర్ణయం తీసుకున్నా పాటిస్తాం అంటున్నారు మరికొందరు నేతలు. బాలినేని నివాసం దగ్గర కార్యకర్తల నినాదాలతో హోరెత్తిపోతోంది. బాలినేనికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని నినాదాలు చేశారు కార్యకర్తలు.
నాకు ఇంకా ఫోన్ కాల్ రాలేదన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మంత్రి వర్గంలో 10 మంది పాత వారికి 15 మంది కొత్త వారికి అవకాశం వుంటుందన్నారు. నాకు పదవి వచ్చినా….రాకపోయినా సీఎం జగన్ ఆదేశాలు మేరకు పనిచేస్తాను. అనంతరం విజయవాడకు బయలుదేరి వెళ్ళారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
మరోవైపు మంత్రి వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం విజయవాడ బయలు దేరారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకి కార్యకర్తలు ఆల్ దిబెస్ట్ చెప్పడం కనిపించింది. ఆయన ఉత్సాహంగా కార్యకర్తలతో సెల్ఫీలు దిగడం విశేషం.

Dharmana Prasada rao
మంత్రి పదవికి సంబంధించి తమకు ఇంకా ఫోన్ రాలేదని అంటున్నారు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, కొండేటి చిట్టిబాబు,దాడిశెట్టి రాజా. అధిష్ఠానం నుండి ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యేలు. ఫోన్ వస్తే బయలుదేరి వెళతాం అంటున్నారు.
తాజావార్తలు
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!