Student Haritha Case: రికవరీ ఏజెంట్ల దుర్మార్గానికి హరిత బలి.. విచారణలో ఒప్పుకున్న నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Student Haritha Case: ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో సంచలనం సృష్టించిన విద్యార్థిని హరిత ఆత్మహత్య కేసులో పోలీసులు ఏడుగురు లోన్ రికవరీ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హరిత ఆత్మహత్యకు బ్యాంకు రికవరీ ఏజెంట్ల వేధింపులే కారణమని నిర్ధారించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నలుగురు ఏజెంట్లు హరిత ఇంటికెళ్లినట్టు అందులో తేలింది. వాళ్లు ఎస్ఎల్వీ ఫైనాన్షియల్ సర్వీస్కు చెందిన ఏజెంట్లుగా గుర్తించారు. రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్లే హరిత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఎస్ఎల్వీ ఫైనాన్షియల్ సర్వీస్ ఏజెన్సీకి చెందిన ప్రతినిధులను శనివారం అరెస్ట్ చేసిన పోలీసులు.. నందిగామ ఏసీపీ నాగేశ్వరరెడ్డి సమక్షంలో వత్సవాయి పీఎస్లో విచారణ నిర్వహించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల అదుపులో ముగ్గురు మేనేజర్లు , నలుగురు రికవరీ ఏజెంట్లు ఉన్నారు. మేనేజర్లు చలువ మున్నేధర్ రెడ్డి సింగిరెడ్డి వెంకటేశ్వరావు , బూరుగు మాధురిలు కాగా.. రికవరీ ఏజెంట్లు చిర్రా పవన్ కుమార్, కురుషోటి భాగ్యతేజ, చల్లా శ్రీనివాసరావు, గజ్జలకొండ వెంకట శివ నాగరాజుగా గుర్తించారు. ప్రధాన సూత్రదారులు చిర్రా పవన్ , కురుషోటి భాగ్యతేజ అలియాస్ సాయిగా గుర్తించారు. హరిత కుటుంబ సభ్యులను అవమానపరిచామని నిందితులు విచారణలో ఒప్పుకున్నారు.
Also Read
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
- Ramprasad Reddy: ఇకపై ఆటోమేటిక్ ఆమోదం.. 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్.. ఆ వాహనాలకు మినహాయింపు!
- CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
- Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
విజయవాడ మొగల్రాజాపురంలోని ఓ బిల్డింగ్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఈ లోన్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బేగంపేట కేంద్రంగా రికవరీ ఏజెన్సీ కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బేగంపేట ఏజెన్సీ మేనేజర్ బూరుగు మాధురిని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
Andhra Pradesh BJP :: బీజేపీపై అమరావతి రైతులు కోపంగా ఉన్నారా..?
అసలేమైందంటే..: జాస్తి హరిత వర్షిణి అనే బాలిక ఈఏపీసెట్లో 15 వేల ర్యాంకు సాధించింది. బాలిక తండ్రి ప్రభాకర్రావు డిల్లీలోని ఒక ప్రైవేటు కంపెనీలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. కుమార్తె చదువు కోసం తండ్రి ప్రభాకర్రావు… రెండేళ్ల క్రితం కరోనా సమయంలో విజయవాడలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా క్రెడిట్ కార్డుపై మూడున్నర లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. ఇటీవల లోన్ రికవరీ ఏజెంట్లు ఇంటి వద్దకు అప్పు చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రిని అరెస్ట్ చేస్తారన్న ఆందోళనతోనూ.. లోన్ రికవరీ ఏజెంట్లు చేసిన వ్యాఖ్యలతో హరిత వర్షిణి ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. మృతురాలి వద్ద లభించిన సూసైడ్ లేఖ ఆధారంగా, బాలిక తల్లి అరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నందిగామ పోలీసులు లోన్ రికవరీ ఏజెంట్లను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Terrorist Digital Plan: భారత్ టార్గెట్గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!
-
Red Necked Nightjar : చందమామతో టైమ్ సెట్ చేసుకునే పక్షి.. ఇదే ప్రకృతి మ్యాజిక్.!
-
Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
-
Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
-
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!