Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Amaravati Farmers Are Angry With Bjp

Andhra Pradesh BJP :: బీజేపీపై అమరావతి రైతులు కోపంగా ఉన్నారా..?

Published Date :August 1, 2022 , 11:55 am
By Premchand Chowdary
Andhra Pradesh BJP :: బీజేపీపై అమరావతి రైతులు కోపంగా ఉన్నారా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Andhra Pradesh BJP : ఏపీ బీజేపీ ఏదో అనుకుంటే ఇంకేదో అవుతోందా? రాజధాని అమరావతి విషయంలో బీజేపీని అక్కడి రైతులు ఎందుకు తప్పు పడుతున్నారు? ప్రతికూల రాజకీయ వాతావరణంలో పాదయాత్రతో కమలనాథులకు ప్రయోజనం ఉందా? సోము వీర్రాజుకు రైతులు ఇచ్చిన షాక్‌పై జరుగుతున్న చర్చ ఏంటి?

అమరావతి ప్రాంతంలో చేపట్టిన పాదయాత్రలో ఏపీ బీజేపీ నేతలకు ఎదురైన అనుభవం ఇది. ఏపీ రాజధాని విషయంలో బీజేపీకి నేతలకు క్లారిటీ ఉందో.. లేక అక్కడి రైతలుకు స్పష్టత ఉందో కానీ.. వీర్రాజును నిలదీసిన ఉదంతం మాత్రం అనేక ప్రశ్నలకు వేదికగా నిలుస్తోంది. ఏపీ ఏకైక రాజధాని అమరావతి అనే నినాదాన్ని బీజేపీ అందుకున్నా.. రాజధాని గ్రామాల ప్రజలు ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారనడానికి ఈ ఘటన అద్దం పడుతోంది. మూడు రాజధానుల ప్రకటన వచ్చాక ఉద్యమించిన ఇక్కడి రైతులు.. బీజేపీపై ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ విపక్షానికి పరిమితం కావడంతో బీజేపీనే ఏదైనా చేస్తుందని ఆశించారు. కానీ.. తమ ఆశలకు.. ఆశయాలకు భిన్నంగా కాషాయ పార్టీ ఉందని చాలా గుర్రుగా ఉన్నారు. అదే బీజేపీ పాదయాత్రలో బయట పడిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Also Read

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
  • Off The Record : రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీకి తలనొప్పిగా మారుతున్నారా?
  • Off The Record: తుమ్మల, పువ్వాడ మధ్య మాటల యుద్ధం..

రాజధాని రైతులు ఉద్యమించిన తొలి నాళ్లల్లో కృష్ణా-గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు బీజేపీ నేతలు కలిసి సంఘీభావం తెలియజేశారు. అప్పటి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ లీడ్‌ తీసుకునేందుకు చూశారు. ఆ ఉద్యమాన్ని బేస్‌ చేసుకుని రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించారు. అయితే రైతులు ఆశించిన స్థాయిలో ఆ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాల నుంచి మద్దతు లేదనే భావన వారిలో బలంగా పాతుకుపోయింది. ముఖ్యంగా రాజధాని అనేది రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని కేంద్రం చేసిన ప్రకటనలు కావచ్చు.. వివిధ సందర్భాల్లో సోము వీర్రాజు, జీవీఎల్‌, విష్ణువర్దన్‌ రెడ్డి వంటి నేతలు చేసిన కామెంట్స్‌ కావొచ్చు.. స్థానిక రైతులకు ఆగ్రహం కలిగించాయి. అప్పట్లో రాజధాని రైతులకు అండగా పాదయాత్ర చేద్దామని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ భావించినా.. మిత్రపక్షంగా ఉన్న బీజేపీనే ఆయన ప్రయత్నాన్ని అడ్డుకుందనే ప్రచారం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజధాని ప్రాంతంలో పర్యటించాలని భావించినా.. దానినీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం అడ్డుకుందనే చర్చ సాగింది. ఇవన్నీ రాజధాని రైతుల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత పెంచాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

ఆ తర్వాత బీజేపీ గొంతు సవరించుకుని ఒకే రాజధాని అనే నినాదాన్ని టేకప్‌ చేసినా.. ఇక్కడి రైతులకు అంతగా కనెక్ట్‌ కాలేదు. ఈ ప్రాంతంలో కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ GVL గట్టిగా డిమాండ్ చేసి.. రాజధాని రైతులను కలిసి మాట్లాడారు. తర్వాత దానిని అడ్వాంటేజ్‌గా మార్చుకుని స్థానిక నాయకత్వం ముందుకు తీసుకెళ్ల లేకపోయింది. అందుకే రాజధాని గ్రామాల్లో చేపట్టిన పాదయాత్రలో వీర్రాజుకు చుక్కెదురైందని అభిప్రాయ పడుతున్నారు. బీజేపీపైనా.. సోము వీర్రాజు వైఖరిపైనా తమలో ఉన్న అభిప్రాయాన్ని ఆయన ముఖం మీదే అడిగేశారు. దాంతో కమల నాథులు కంగుతిన్నారు.

తాజా ఘటన తర్వాత బీజేపీ కూడా ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. రాజధాని రైతులకు బీజేపీలోని ఏయే నేతలపట్ల సాఫ్ట్‌ కార్నర్‌ ఉందో.. వారితో ఎక్కువగా పర్యటనలు చేపడితే బాగుంటుందని లెక్కలేస్తున్నారట. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరు చర్చల్లోకి వచ్చిందట. గతంలో ఆయన సంఘీభావ ఉద్యమాలు చేసి ఉండటంతో.. ఆయన ఫీల్డ్‌లోకి వస్తే ప్రతిఘటన ఉండబోదని అనుకుంటున్నారట. మొత్తానికి జనంతో జాగ్రత్తగా ఉండాలని తాజా ఘటనతో కమలనాథులకు గట్టిగానే బోధపడినట్టు ఉంది.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravathi
  • Andhra Pradesh BJP
  • AP BJP chief Somu Veerraju
  • gvl
  • kanna lakshminarayana

తాజావార్తలు

  • Vastu Tips: మీ డైనింగ్ టేబుల్‌పై ఈ వస్తువులు పెడుతున్నారా? అయితే దరిద్రం మీ తలుపు తట్టడం ఖాయం!

  • Sugar-Free Lassi Recipe: మండే ఎండ నుంచి తక్షణ ఉపశమనం.. షుగర్‌ లేకుండా క్షణాల్లో టేస్టీ లస్సీ..

  • Viral Video: అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్‌లు.. అవాక్కైన నెటిజన్లు

  • Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్‌.. పగటి కలలు మానుకో..!

  • BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions