Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Amaravati Farmers Are Angry With Bjp

Andhra Pradesh BJP :: బీజేపీపై అమరావతి రైతులు కోపంగా ఉన్నారా..?

Published Date :August 1, 2022 , 11:55 am
By Premchand Chowdary
Andhra Pradesh BJP :: బీజేపీపై అమరావతి రైతులు కోపంగా ఉన్నారా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Andhra Pradesh BJP : ఏపీ బీజేపీ ఏదో అనుకుంటే ఇంకేదో అవుతోందా? రాజధాని అమరావతి విషయంలో బీజేపీని అక్కడి రైతులు ఎందుకు తప్పు పడుతున్నారు? ప్రతికూల రాజకీయ వాతావరణంలో పాదయాత్రతో కమలనాథులకు ప్రయోజనం ఉందా? సోము వీర్రాజుకు రైతులు ఇచ్చిన షాక్‌పై జరుగుతున్న చర్చ ఏంటి?

అమరావతి ప్రాంతంలో చేపట్టిన పాదయాత్రలో ఏపీ బీజేపీ నేతలకు ఎదురైన అనుభవం ఇది. ఏపీ రాజధాని విషయంలో బీజేపీకి నేతలకు క్లారిటీ ఉందో.. లేక అక్కడి రైతలుకు స్పష్టత ఉందో కానీ.. వీర్రాజును నిలదీసిన ఉదంతం మాత్రం అనేక ప్రశ్నలకు వేదికగా నిలుస్తోంది. ఏపీ ఏకైక రాజధాని అమరావతి అనే నినాదాన్ని బీజేపీ అందుకున్నా.. రాజధాని గ్రామాల ప్రజలు ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారనడానికి ఈ ఘటన అద్దం పడుతోంది. మూడు రాజధానుల ప్రకటన వచ్చాక ఉద్యమించిన ఇక్కడి రైతులు.. బీజేపీపై ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ విపక్షానికి పరిమితం కావడంతో బీజేపీనే ఏదైనా చేస్తుందని ఆశించారు. కానీ.. తమ ఆశలకు.. ఆశయాలకు భిన్నంగా కాషాయ పార్టీ ఉందని చాలా గుర్రుగా ఉన్నారు. అదే బీజేపీ పాదయాత్రలో బయట పడిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

రాజధాని రైతులు ఉద్యమించిన తొలి నాళ్లల్లో కృష్ణా-గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు బీజేపీ నేతలు కలిసి సంఘీభావం తెలియజేశారు. అప్పటి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ లీడ్‌ తీసుకునేందుకు చూశారు. ఆ ఉద్యమాన్ని బేస్‌ చేసుకుని రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించారు. అయితే రైతులు ఆశించిన స్థాయిలో ఆ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాల నుంచి మద్దతు లేదనే భావన వారిలో బలంగా పాతుకుపోయింది. ముఖ్యంగా రాజధాని అనేది రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని కేంద్రం చేసిన ప్రకటనలు కావచ్చు.. వివిధ సందర్భాల్లో సోము వీర్రాజు, జీవీఎల్‌, విష్ణువర్దన్‌ రెడ్డి వంటి నేతలు చేసిన కామెంట్స్‌ కావొచ్చు.. స్థానిక రైతులకు ఆగ్రహం కలిగించాయి. అప్పట్లో రాజధాని రైతులకు అండగా పాదయాత్ర చేద్దామని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ భావించినా.. మిత్రపక్షంగా ఉన్న బీజేపీనే ఆయన ప్రయత్నాన్ని అడ్డుకుందనే ప్రచారం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజధాని ప్రాంతంలో పర్యటించాలని భావించినా.. దానినీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం అడ్డుకుందనే చర్చ సాగింది. ఇవన్నీ రాజధాని రైతుల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత పెంచాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

ఆ తర్వాత బీజేపీ గొంతు సవరించుకుని ఒకే రాజధాని అనే నినాదాన్ని టేకప్‌ చేసినా.. ఇక్కడి రైతులకు అంతగా కనెక్ట్‌ కాలేదు. ఈ ప్రాంతంలో కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ GVL గట్టిగా డిమాండ్ చేసి.. రాజధాని రైతులను కలిసి మాట్లాడారు. తర్వాత దానిని అడ్వాంటేజ్‌గా మార్చుకుని స్థానిక నాయకత్వం ముందుకు తీసుకెళ్ల లేకపోయింది. అందుకే రాజధాని గ్రామాల్లో చేపట్టిన పాదయాత్రలో వీర్రాజుకు చుక్కెదురైందని అభిప్రాయ పడుతున్నారు. బీజేపీపైనా.. సోము వీర్రాజు వైఖరిపైనా తమలో ఉన్న అభిప్రాయాన్ని ఆయన ముఖం మీదే అడిగేశారు. దాంతో కమల నాథులు కంగుతిన్నారు.

తాజా ఘటన తర్వాత బీజేపీ కూడా ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. రాజధాని రైతులకు బీజేపీలోని ఏయే నేతలపట్ల సాఫ్ట్‌ కార్నర్‌ ఉందో.. వారితో ఎక్కువగా పర్యటనలు చేపడితే బాగుంటుందని లెక్కలేస్తున్నారట. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరు చర్చల్లోకి వచ్చిందట. గతంలో ఆయన సంఘీభావ ఉద్యమాలు చేసి ఉండటంతో.. ఆయన ఫీల్డ్‌లోకి వస్తే ప్రతిఘటన ఉండబోదని అనుకుంటున్నారట. మొత్తానికి జనంతో జాగ్రత్తగా ఉండాలని తాజా ఘటనతో కమలనాథులకు గట్టిగానే బోధపడినట్టు ఉంది.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravathi
  • Andhra Pradesh BJP
  • AP BJP chief Somu Veerraju
  • gvl
  • kanna lakshminarayana

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions