Konaseema Riots: కోనసీమ అల్లర్ల కేసులో అమాయకులు బలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కోనసీమ అల్లర్ల కేసు లో అమాయకులు బలి అవుతున్నారా? తమ ఫెయిల్యూర్ లని కప్పి పుచ్చుకోవడానికి పోలీసులు దొరికిన వాళ్ళ పై కేసులు పెడుతున్నారా? అసలు ఊళ్ళో లేని వారి పై కేసులు ఎలా పెడతారు? వాటి గురించి పోలీసులు ఏమంటున్నారు? ఇప్పుడిదే కోనసీమలో హాట్ టాపిక్ అవుతోంది.
కోనసీమ జిల్లా కి అంబేద్కర్ పేరు పెట్టవద్దని ఈ నెల 20 న అమలాపురంలో భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.పోలీసులు కూడా ఊహించని స్థాయి లో జనం పోగయ్యారు.. వేల మంది ఒక్కసారిగా రావడంతో భారీ విధ్వంసం సృష్టించారు.. అయితే ఆ రోజు రాత్రి నుండి పోలీసులు కేసులపై దృష్టి పెట్టారు.. అరెస్టులు కేసులు అంటూ నిందితుల కోసం కుస్తీ పడుతున్నారు.. ఇప్పటి వరకు ఈ కేసులలో 46 మంది పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.19 మందిని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ కేసులు విషయం లో పెద్ద గందరగోళం ఏర్పడింది. పోలీసులు హడావుడి కేసులతో అమాయకులు బలి అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
Also Read
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
ఇతర పనులతో ఆ రోజు అమలాపురం వచ్చిన వారు కేసులలో బుక్ అయిన వారు ఉన్నారు. తమకేమి తెలియదు అని పోలీసులు చుట్టూ తిరుగుతున్న వారు ఉన్నారు..పోలీసులు మాత్రం అన్ని చట్ట పరంగా చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఎఫ్ ఐ ఆర్ ఫైనల్ కాదని మార్పులు చేర్పులు ఉంటాయని చెప్తున్నారు.. కానీ కేసులు నమోదు అయినవారు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. కేసులలో తమకు సంబంధం లేకుండా ఇరుక్కున్న వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. తమకి ఈ కేసులు ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు.. ఒక్క సారి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం వలన భవిష్యత్తు పోతుందని అంటున్నారు. పోలీసులు కేసులు నమోదు చేయాలనే అత్యుత్సాహం ఎక్కువ ఉందని వాపోతున్నారు.
కేసులు మరిన్ని నమోదు అవుతాయని పోలీసులు చెబుతున్నారు..తమ పేర్లు ఎక్కడ ఉంటాయో అని చాలా మంది టెన్షన్ పడుతున్నారు.. పోలీసులు ఇప్పటికే 350 సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. చాలా మంది ఆ రోజు రోడ్ల పైకి వచ్చి జరిగిన ఆందోళనలను చూశారు.. అటువంటి వారి ఫోటోలు సైతం పోలీసుల లిస్ట్ లో ఉన్నాయి. జిల్లా కేంద్రం కావడంతో హాస్పిటల్ ,మార్కెట్ పనులు కోసం వచ్చిన చాలా మంది ఈ గొడవలలో ఇరుక్కుపోయారు.. కొందరు ఒకే పేరు తో చాలా మంది వ్యక్తులు ఉంటారు. పొరపాటున పోలీసులు ఒకరికి బదులు ఒకరిని తీసుకువెళుతున్నారు.. దాంతో నానా హైరానా పడిపోతున్నారు..కొందరు ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేసి కనీసం కుటుంబ సభ్యులకి కూడా అందుబాటులోకి రావడం లేదు. మొత్తానికి కోనసీమ అల్లర్ల కేసులతో పోలీసులు గందరగోళం సృష్టిస్తున్నారు.. చాలా మంది సంబంధం లేని వాళ్ళు ఇందులో ఇరుక్కుంటున్నారు. మరి ఖాకీలు కేసులు విషయంలో ఎటువంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.. అమాయకులను ఈ వివాదాల లోకి లాగకుండా చూడాల్సిన అవసరం ఉంది.
India-Bangladesh: రెండేళ్ల తరువాత ఇరు దేశాల మధ్య రైళ్లు ప్రారంభం
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!