మాకు ప్రజా బలం ఉంది, పోలీసులు అవసరం లేదు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కడపజిల్లా బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం రాజకీయ పార్టీల బాధ్యత అని, తమకు ప్రజా బలం ఉందని, పోలీసులు అవసరం లేదన్నారు. కేంద్రంలో అధికారం ఉందన్న గర్వంతో బీజేపీ ప్రజలను ఓట్లు అడగకుండా పత్రిక సమావేశాలకు పరిమితమై పోయిందన్నారు. ప్రభుత్వం పై బురద జల్లేందుకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు.
ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం ఇది చెయ్యలేదని ప్రశ్నించలేని పరిస్థితి ప్రతిపక్షాలదని ఆయన అన్నారు. సోమశిల నిర్వాసితులకు అన్నివిధాల న్యాయం చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు శ్రీకాంత్ రెడ్డి.. ప్రతి రైతుకు 6 నుంచి 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చిన ఘనత వైఎస్సార్ ది అని. సోమశిల విషయంలో పెండింగ్లో ఉన్న 19 వేల అప్లికేషన్లలో అర్హులైన అందరికి వన్ టైం సెటిల్ మెంట్ చేస్తామన్నారు.
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
నిష్పక్షపాత ఎన్నికలు జరగాలని మేము కూడా కోరుకుంటున్నామని, ఎన్నికల కమిషన్ను మేము కూడా అడుగుతామని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బీజేపీ నేతలు మందిమార్బలంతో వచ్చి అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. పారా మిలటరీ బలగాలతో హడావుడి చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. మొత్తం ఆర్మీ బలగాలు దించినా ఏం కాదన్నారు. కాంగ్రెస్ , బీజేపీ కలయికతోనే రాష్ట్ర విభజన జరిగిందన్నారు.
మాకు రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని విభజన చట్టంలోని ఉన్న హామీలనే అడుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, దుగరాజపట్నం , స్టీల్ ప్లాంట్ ఇస్తే పోటీ నుంచి విరమించుకుంటాం. పెట్రోల్ , డీజిల్ , గ్యాస్ ధరలు ఎందుకు పెంచుతున్నారు.. ఎందుకు మాట్లాడడం లేదు. వ్యక్తిగతంగా దూషణలు, ఆరోపణలు చేయడం సంస్కారం కాదన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా ప్రధాని చెప్పారు.
ఆదినారాయణ రెడ్డి ఆరోపణలు కేవలం కేంద్రంలో పదవి కోసమేనని శ్రీకాంత్రెడ్డి అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ భిక్ష పెట్టినవారిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. డిపాజిట్లు రావని తెలిసి ప్రచారం వదిలేసి అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఉనికి కాపాడుకోవడం కోసం ఆరాట పడుతున్నారు. ప్రజల్లోకి తిరిగి ఓట్లు అడగండి. ప్రెస్ మీట్లకు పరిమితమై ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. టీడీపీ ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడ్డం అనవసరం. మోడీ అంతు తెలుస్తానని చెప్పిన చంద్రబాబు తరువాత వంగి వంగి దండాలు పెట్టారన్నారు. ఏదో రకంగా ప్రచారం కావాలని టీడీపీ కోరుకుంటుందని చంద్రబాబు గురించి అందరికి తెలుసునని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
-
Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
-
Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!