ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.. ఢిల్లీ నుంచి మళ్లీ రాష్ట్రానికి వచ్చారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్.. ప్రస్తుతం ఏపీ భవన్ ప్రిన్సిపాల్ రెసిడెంట్ కమిషనర్గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ను.. ఆంధ్రప్రదేశ్ రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీగా బదిలీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఇక, పొర సరఫరాల కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా వీర పాండ్యన్ను బదిలీ చేసింది.. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపాల్ రెసిడెంట్ కమిషనర్గా చీఫ్ అడ్వైజర్ ఆదిత్య నాథ్ దాస్కి అదనపు బాధ్యతలు అప్పగించింది వైఎస్ జగన్ సర్కార్. మరోవైపు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్కు అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.. సీఎస్ సమీర్ శర్మ లీవ్లో ఉన్న కారణంగా… సమీర్ శర్మ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో విజయానంద్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్.
Read Also: YS Jagan Mohan Reddy: నేను, మీరు కలిస్తేనే 175కి 175 సీట్లు.. 19 నెలల్లో ఎన్నికలు..!