శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న మహిళా రైతుల్ని రెచ్చగొట్టడం సరికాదని, పాదయాత్రకి అడ్డంకులు సృష్టించడం సబబు కాదని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. కడుపు మండి ధర్నా చేసే మహిళా రైతుల మాటలను వక్రీకరిస్తూ మాట్లాడటమేంటని ఆమె మండిపడ్డారు. ధర్నా చేస్తున్న మహిళా రైతుల్ని బూటు కాళ్లతో తన్నించడం ఎంత వరకు సమంజసం వైసీపీ నాయకు లను ఆమె నిలదీశారు. రాజధాని రైతులను దుర్భాషలాడితే సహిం చేది లేదని హెచ్చరించారు.
నిరసన తెలియజేసినవారికి మద్దతు తెలిపే హక్కును కాలరా స్తున్నారని, దీనిక మద్దతిస్తున్న న్యాయ స్థానాలకు సలాం అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులకన్నా పెద్ద పెయిడ్ ఆర్టిస్టులెవరూ లేరన్నారు. ట్వీట్ పెట్టడానికి రూ. 5 లు తీసుకునే పేటీయం బ్యాచ్ వైసీపీది.ఈ రెండున్నరేళ్లల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల పని అయిపోయింది. ఇంకో రెండున్నర ఏళ్లలో అంతా క్లోజ్ అవుతుందని ఆమె అన్నారు. అమరావతి రాజధాని అక్కడే కొనసాగుతుందని సీఎం ఒక మాట చెబితే అందరూ హర్షిస్తారని వంగలపూడి అనిత అన్నారు.