బీజేపీ నేతల అరెస్టులకు సీఎం జగన్ బాధ్యత వహించాలి: జీవీఎల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో “సంక్రాంతి సంబరాలు” ముగింపు కార్యక్రమలకు గుడివాడ వెళ్తున్న బీజేపీ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడారు. పోలీసులు ఏ నిబంధనలతో బీజేపీ నాయకులను అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసి బస్సుల్లో తరలించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించడమేంటని ఆయన మండిపడ్డారు. అధికార దాహానికి, అధికార మదానికి హద్దు ఉంటుందని వైసీపీకి చురకలంటించారు. అరెస్ట్ చేసిన వారిని ఇప్పటికీ మూడు, నాలుగు పోలీస్ స్టేషన్లు మార్చారన్నారు. అరాచకాలు సృష్టిస్తున్న వారిని వైసీపీ ప్రభుత్వం ఏమి చేయలేక బీజేపీ నేతలను అరెస్టులు చేసి కేసులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారో సీఎం జగన్ సమాధానం చెప్పి తీరాలన్నారు. వైసీపీ వారికి ముగ్గుల పోటీలు పెట్టకూడదు.. కానీ మూడు ముక్కలాటలను మాత్రం ప్రోత్సహిస్తారంటూ ఎద్దేవా చేశారు.బీజేపీ నేతల అక్రమ అరెస్టులకు సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు. పోలీస్ అధికారులు నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని జీవీఎల్ హెచ్చరించారు.
అధికార పక్షం చెప్పినట్లు పోలీస్ అధికారులు వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. బీజేపీతో చెలగాటం ఆడొద్దు.. ఇది టీడీపీ కాదు.. తప్పుడు కేసులు పెడితే బీజేపీ చూస్తు ఊరుకోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగోలుగా వ్యవహరిస్తే వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ విమర్శించారు. పీఆర్సీ అంటే “పే రివిజన్” కమిషన్ అనుకున్నారా…పే రెడ్యూస్డ్ కమిషన్ అనుకున్నారా.. అంటూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పీఆర్సీ పెంచేదే లే అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగుల గుండె రగులుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి రోజు ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ పడుకుంటున్నారని జీవీఎల్ అన్నారు. ప్రజల దృష్టి మార్చే పనులు చేస్తే అది వైసీపీ ప్రభుత్వానికే నష్టం కలిగిస్తుందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. పీఆర్సీ, బీజేపీ నేతల అరెస్టులపై జగన్ సమాధానం చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
తాజావార్తలు
-
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!
-
IRUMUDI OTT : ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ ‘ఇరుముడి’ ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!