బీజేపీ నేతల అరెస్టులకు సీఎం జగన్ బాధ్యత వహించాలి: జీవీఎల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో “సంక్రాంతి సంబరాలు” ముగింపు కార్యక్రమలకు గుడివాడ వెళ్తున్న బీజేపీ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడారు. పోలీసులు ఏ నిబంధనలతో బీజేపీ నాయకులను అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసి బస్సుల్లో తరలించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించడమేంటని ఆయన మండిపడ్డారు. అధికార దాహానికి, అధికార మదానికి హద్దు ఉంటుందని వైసీపీకి చురకలంటించారు. అరెస్ట్ చేసిన వారిని ఇప్పటికీ మూడు, నాలుగు పోలీస్ స్టేషన్లు మార్చారన్నారు. అరాచకాలు సృష్టిస్తున్న వారిని వైసీపీ ప్రభుత్వం ఏమి చేయలేక బీజేపీ నేతలను అరెస్టులు చేసి కేసులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారో సీఎం జగన్ సమాధానం చెప్పి తీరాలన్నారు. వైసీపీ వారికి ముగ్గుల పోటీలు పెట్టకూడదు.. కానీ మూడు ముక్కలాటలను మాత్రం ప్రోత్సహిస్తారంటూ ఎద్దేవా చేశారు.బీజేపీ నేతల అక్రమ అరెస్టులకు సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు. పోలీస్ అధికారులు నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని జీవీఎల్ హెచ్చరించారు.
అధికార పక్షం చెప్పినట్లు పోలీస్ అధికారులు వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. బీజేపీతో చెలగాటం ఆడొద్దు.. ఇది టీడీపీ కాదు.. తప్పుడు కేసులు పెడితే బీజేపీ చూస్తు ఊరుకోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగోలుగా వ్యవహరిస్తే వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ విమర్శించారు. పీఆర్సీ అంటే “పే రివిజన్” కమిషన్ అనుకున్నారా…పే రెడ్యూస్డ్ కమిషన్ అనుకున్నారా.. అంటూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పీఆర్సీ పెంచేదే లే అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగుల గుండె రగులుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి రోజు ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ పడుకుంటున్నారని జీవీఎల్ అన్నారు. ప్రజల దృష్టి మార్చే పనులు చేస్తే అది వైసీపీ ప్రభుత్వానికే నష్టం కలిగిస్తుందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. పీఆర్సీ, బీజేపీ నేతల అరెస్టులపై జగన్ సమాధానం చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
తాజావార్తలు
-
Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
-
Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్లు విధించేలా చట్టం
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!