GVL Narasimha Rao: వందే భారత్.. విప్లవాత్మక మార్పుకు నాంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVL Narasimha Rao Travels In Vande Bharat Train: దేశంలోని రైలు ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న ప్రధాని మోడీ ఆలోచనతో వచ్చిందే వందే భారత్ ట్రైన్ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్కు ఘనంగా స్వాగతం పలికిన అనంతరం అందులో ఏలూరు వరకు ప్రయాణించిన జీవీఎల్.. పేద, మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా ఈ వందే భారత్ ట్రైన్ని కేంద్రం తీసుకొచ్చిందని అన్నారు. ఏసీ బస్సుల్లో ప్రయాణానికి ఎంత చార్జీ అవుతుందో, అంతే చార్జీలతో ఈ అత్యాదునిక ట్రైన్లలో ప్రయాణించవచ్చని తెలిపారు. విదేశాలతో పోలిస్తే.. భారత్లోనే రైలు చార్జీలు చాలా తక్కువ అని చెప్పారు. విదేశాల్లో ప్రీమియం ట్రైన్ చార్జీలు.. విమాన చార్జీల కంటే ఐదు రెట్లు అధికంగా ఉంటాయని.. మన దేశంలో నడుస్తున్న వందే భారత్ ట్రైన్ చార్జీలు ఫ్లైట్ చార్జీల్లో 4వ వంతు మాత్రమేనని స్పష్టం చేశారు.
Marriage: వివాహంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అదెలాగా అంటారా!
Also Read
- YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు మొదటి దశ వందే భారత్ ట్రైన్లు ఏర్పాటు చేసిన తర్వాత.. రెండవ ఫేజ్లో ఆంధ్రప్రదేశ్కు మరిన్ని వందే భారత్ ట్రైన్లు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని జీవీఎల్ హామీ ఇచ్చారు. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చిందన్నారు. మొదట హైదరాబాదు నుంచి విజయవాడ వరకే ప్రతిపాదన ఉండేదని.. ఆ తర్వాత విశాఖ వరకూ దాన్ని పొడిగించామని చెప్పారు. అత్యంత వేగవంతమైన అధునాతన సౌకర్యాలతో ఈ రైలును సిద్ధం చేశామన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని.. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా త్వరలో విజయవాడ రైల్వేస్టేషన్ను కూడా ఆధునికీకరిస్తామని తెలియజేశారు.
Libraries : తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు
తాజావార్తలు
-
YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..