Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Sajjala Ramakrishna Reddy Says He Will Bring The Situation In Ap To The Attention Of The Prime Minister And President

Sajjala Ramakrishna Reddy: ఏపీలో వ్యవస్థలు గాడి తప్పాయి.. ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తాం..!

Published Date :June 7, 2025 , 2:24 pm
By Sudhakar Ravula
  • ఏపీలో వ్యవస్థలు గాడి తప్పాయి..
  • రాష్ట్రంలో ఆర్గనైజ్డ్ క్రైమ్‌ పెరిగిపోయింది..
  • ప్రస్తుత పరిస్థితిని ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తాం..
Sajjala Ramakrishna Reddy: ఏపీలో వ్యవస్థలు గాడి తప్పాయి.. ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తాం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sajjala Ramakrishna Reddy: ఏపీలో వ్యవస్థలు గాడి తప్పాయి.. రాష్ట్రంలో జరుగుతోన్న క్రైమ్‌, ప్రస్తుత పరిస్థితిన ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్తాం అన్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను గుంటూరు రమేష్ హాస్పిటల్‌లో వైసీపీ నేతలతో కలిసి పరామర్శించనున్న సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఏర్పాటై ఏడాది అయ్యింది. ఎన్నికలకు‌ముందు మా పాలన డిఫరెంట్ గా ఉంటుందన్నారు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను ప్రైవేటు ఆర్మీలా తయారు చేసి ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారు.. తప్పుడు కేసులు పెడుతున్నారు.. రోజూ పది తప్పుడు కేసులు పెడుతున్నారంటూ విమర్శించారు.

Read Also: BJP New President: నెలాఖరులోగా బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు..!

అరాచక శక్తులు, గూండాలు చేసే పనులు వీళ్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్గనైజ్డ్ గా క్రైం చేస్తున్నారు. క్రిమినల్ గ్యాంగ్ కు యూనిఫారం వేసినట్లుంది ఈ వ్యవహారం అంటూ సంచలన ఆరోపణలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇక, లక్ష్మీనారాయణ ఏ పార్టీ అన్నది కాదు.. కులాన్ని తీసుకొచ్చారు. అసలు డీఎస్పీకి సివిల్ మ్యాటర్ లో ఏం పని..? అని ప్రశ్నించారు.. ఫ్రెండ్లీ పోలీస్ మరిచి యాభై ఏళ్లక్రితం ఎమర్జెన్సీకి తీసుకెళ్తున్నారని విమర్శించారు. రక్షించాల్సిన వారే అరాచక శక్తి అయితే ఎవరు ఏం చెయ్యగలరు..? అని ఆవేదన వ్యక్తం చేశారు.. శాతవసహన కాలేజీని అర్ధరాత్రి కూలగొట్టాల్సిన అవసరం ఏంటి..? దీని వెనుక టీడీపీ నేత ఉన్నారన్న ఆయన.. సంఘవిద్రోహక శక్తుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. నిజాయితీ ఉన్న పోలీసులు లూప్ లైన్ లో ఉన్నారు. వ్యవస్థ గాడి తప్పింది.. అయినా, ఒక్కరిపై చర్యలు లేవు.. పోలీసులే పంచాయతి చేస్తారు… శిక్షలు కూడా వాళ్లే వేస్తారు అంటూ మండిపడ్డారు.

Read Also: Minister Savita: మంత్రి గారికి కోపం వచ్చింది.. బొకే విసిరికొట్టింది..!

మరణవాంగ్మూలం కంటే ఏది ఎక్కువ కాదు.. లక్ష్మీనారాయణ స్వయంగా పోలీసుల వేధింపుల గురించి చెప్పారు.. కృష్ణవేణి, సుధారాణిలను‌ వేధించారు. ఆర్గనైజ్డ్ అరాచకానికి చట్టాన్ని కాపాడే పోలీసులను అడ్డం పెట్టుకున్నారు.. ఇంత కన్నా దిగజారేది లేదు అంటూ ఫైర్‌ అయ్యారు సజ్జల.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు పరిస్థితి గమనించాలి.. అదుపుతప్పుతున్న వ్యవస్థలు రేపు మరింత డేంజర్ అవుతాయని హెచ్చరించారు. లక్ష్మీనారాయణ ఘటపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి.. తప్పులకు పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.. తప్పుడు కేసులు, వేధింపులపై కోర్టులు, మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తాం అన్నారు.. ఇక, ప్రధాని మోడీ, రాష్ట్రపతి దృష్టికి రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు తీసుకెళ్తాం అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap crime
  • AP situation
  • cm chandrababu
  • President of India

తాజావార్తలు

  • Adivi Sesh: నేను కాలితో తంతే అనుష్క మెడకి గాయమైంది!!

  • US Defense Budget 2026: రూ.140 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? యుద్ధం వేళ కళ్లు బైర్లు కమ్మే అమెరికా రక్షణ బడ్జెట్!

  • VC Sajjanar: మీ బాస్ పేరుతో వాట్సాప్ మెసేజ్ వస్తే నమ్మకండి!.. సీపీ సజ్జనర్ హెచ్చరిక..

  • Vaibhav Sooryavanshi: బ్యాటింగ్ లో దూకుడే కాదు.. సంస్కారంలోనూ తోపే.! ఆశిష్ నెహ్రా కాళ్లకు మొక్కిన వైభవ్..

  • Mani Ratnam: మణిరత్నం ‘మేజిక్’.. విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబో ఫిక్స్!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions