Draupadi Murmu: నేడు ఏపీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మంగళగిరిలో ట్రాఫిక్ ఆంక్షలు!
- నేడు ఏపీలో పర్యటించనున్న రాష్ట్రపతి ముర్ము..
- మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొననున్న ద్రౌపది ముర్ము..
- ఈ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Draupadi Murmu: మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం ఈరోజు (డిసెంబర్ 17) జరగనుంది. దీనికి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి ఎయిమ్స్లో కట్టుదిట్టమైన భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా 49 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కు డిగ్రీలు, పోస్టు డాక్టోరల్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన మరో నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలను అందిస్తారు. విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎయిమ్స్ను మంజూరు చేయగా.. ఎయిమ్స్ ప్రాంగణంలో 2020 నుంచి 125 సీట్లకు పర్మిషన్ పొంది ఆ మేరకు విద్యా బోధన కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్ రావ్ గణపత్రావ్ జాదవ్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, నారా లోకేశ్ గౌరవ అతిథులుగా పాల్గొననున్నారు.
Read Also: Georgia: జార్జియాలో తీవ్ర విషాదం.. 11 మంది భారతీయులు మృతి..!
Also Read
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
- Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
అయితే, నేడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎయిమ్స్ స్నాతకోత్సవానికి వస్తుండటంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు ప్రకటించారు. నేటి ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భారీ వాహనాలన్నీ ఇతర మార్గాల్లో వెళ్లాల్సి ఉందన్నారు.
Read Also: Off The Record: భూమా కుటుంబంలో ఏం జరుగుతుంది..?
ఇక, చెన్నై నుంచి వైజాగ్ వైపు వెళ్లే వాహనాలను గుంటూరు బుడంపాడు మీదుగా అవనిగడ్డ-పామర్రు-గుడివాడ-హనుమాన్ జంక్షన్ వైపుకు మళ్లీంపు..
* వైజాగ్ నుంచి ఏలూరు, విజయవాడ, చెన్నై వెళ్లే వెహికిల్స్ హనుమాన్ జంక్షన్- గుడివాడ, పామర్రు, అవనిగడ్డ మీదుగా మళ్లీంపు.. * విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మీదుగా వెళ్లాలని జిల్లా ఎస్పీ గంగధారరావు సూచించారు. * వాహనదారులు ఈ హెచ్చరికలను గమనించి సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!