Georgia: జార్జియాలో తీవ్ర విషాదం.. 11 మంది భారతీయులు మృతి..!
- జార్జియాలో తీవ్ర విషాదం..
- గూడౌరిలోని రెస్టరెంట్లో 12 మంది అనుమానాస్పదంగా మృతి..
- మృతుల్లో 11 మంది భారతీయులు ఉన్నారని ఇండియన్ ఎంబసీ ఆఫీస్ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Georgia: జార్జియాలో తీవ్ర విషాదం నెలకొంది. స్కై రిసార్ట్గా ప్రసిద్ధి చెందిన గూడౌరిలోని రెస్టరెంట్లో 12 మంది అనుమానాస్పదంగా మరణించారు. అందులో 11 మంది ఇండియన్స్ ఉన్నారు. ఈ విషయాన్ని భారత అధికారులు నిర్ధారించారు. అయితే, గూడౌరిలోని భారతీయ రెస్టరెంట్ అయిన హవేలీలో వారంతా అక్కడ సిబ్బందిగా కొనసాగుతున్నారు. కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లే 12 మంది చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అక్కడి ఇండియన్ ఎంబసీ కార్యాలయం స్పందించింది. 11 మంది భారతీయులు మరణించినట్లు మా దృష్టికి వచ్చిందని పేర్కొనింది. ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం.. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, మృతదేహాలను వారి ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. మరణించిన వారి ఫ్యామిలీస్ తో మాట్లాడుతున్నాం.. వారికి సాధ్యమైనంతగా సహాయం చేసేందుకు ట్రై చేస్తున్నామని ఓ ప్రకటనలో వెల్లడించారు.
Read Also: One Nation One Election: నేడు లోక్సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
Also Read
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్లైన్స్పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
కాగా, డిసెంబర్ 14వ తేదీన ఈ ఘటన జరిగినట్లు సమాచారం. వారిపై ఎలాంటి దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించలేదని జార్జియా అంతర్గత వ్యవహరాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బాధితులందరూ కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లే మరణించినట్లు పోలీసులు తెలిపినట్లు అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది. అయితే, రెస్టరెంట్లోని రెండో ఫ్లోర్లో మృతదేహాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ప్రైమరీ దర్యాప్తులో బాధితుల బెడ్ రూమ్స్ సమీపంలో ఒక పవర్ జనరేటర్ను గుర్తించారు పోలీసులు. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో దాన్ని అక్కడికి మార్చినట్లు సమాచారం. అయితే, 12 మంది మృతికి కచ్చితమైన కారణంపై ఫోరెన్సిక్ టీమ్ ను ఏర్పాటు చేసినట్లు జార్జియా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజావార్తలు
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో సిల్వర్
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్కు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!