Georgia: జార్జియాలో తీవ్ర విషాదం.. 11 మంది భారతీయులు మృతి..!
- జార్జియాలో తీవ్ర విషాదం..
- గూడౌరిలోని రెస్టరెంట్లో 12 మంది అనుమానాస్పదంగా మృతి..
- మృతుల్లో 11 మంది భారతీయులు ఉన్నారని ఇండియన్ ఎంబసీ ఆఫీస్ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Georgia: జార్జియాలో తీవ్ర విషాదం నెలకొంది. స్కై రిసార్ట్గా ప్రసిద్ధి చెందిన గూడౌరిలోని రెస్టరెంట్లో 12 మంది అనుమానాస్పదంగా మరణించారు. అందులో 11 మంది ఇండియన్స్ ఉన్నారు. ఈ విషయాన్ని భారత అధికారులు నిర్ధారించారు. అయితే, గూడౌరిలోని భారతీయ రెస్టరెంట్ అయిన హవేలీలో వారంతా అక్కడ సిబ్బందిగా కొనసాగుతున్నారు. కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లే 12 మంది చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అక్కడి ఇండియన్ ఎంబసీ కార్యాలయం స్పందించింది. 11 మంది భారతీయులు మరణించినట్లు మా దృష్టికి వచ్చిందని పేర్కొనింది. ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం.. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, మృతదేహాలను వారి ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. మరణించిన వారి ఫ్యామిలీస్ తో మాట్లాడుతున్నాం.. వారికి సాధ్యమైనంతగా సహాయం చేసేందుకు ట్రై చేస్తున్నామని ఓ ప్రకటనలో వెల్లడించారు.
Read Also: One Nation One Election: నేడు లోక్సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
Also Read
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
కాగా, డిసెంబర్ 14వ తేదీన ఈ ఘటన జరిగినట్లు సమాచారం. వారిపై ఎలాంటి దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించలేదని జార్జియా అంతర్గత వ్యవహరాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బాధితులందరూ కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లే మరణించినట్లు పోలీసులు తెలిపినట్లు అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది. అయితే, రెస్టరెంట్లోని రెండో ఫ్లోర్లో మృతదేహాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ప్రైమరీ దర్యాప్తులో బాధితుల బెడ్ రూమ్స్ సమీపంలో ఒక పవర్ జనరేటర్ను గుర్తించారు పోలీసులు. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో దాన్ని అక్కడికి మార్చినట్లు సమాచారం. అయితే, 12 మంది మృతికి కచ్చితమైన కారణంపై ఫోరెన్సిక్ టీమ్ ను ఏర్పాటు చేసినట్లు జార్జియా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!