Muppavarapu Venkaiah Naidu: మాతృ భాషను మర్చిపోయిన వాడు మనిషి కాదు.. నేను తెలుగులోనే మాట్లాడతా..
- మాతృ భాషను మర్చిపోయిన వాడు మనిషి కాదు..
- నేను తెలుగులోనే మాట్లాడతాను..
- తెలుగు వచ్చిన వాళ్ల ముందు ఇంగ్లీషులో మాట్లాడటం ఎందుకో..?
- ఘాటు వ్యాఖ్యలు చేసిన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muppavarapu Venkaiah Naidu: మాతృ భాషను మర్చిపోయిన వాడు మనిషి కాదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తత్వవేత్త కొత్త సచ్చిదానందమూర్తి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను తెలుగులోనే మాట్లాడతానని స్పష్టం చేశారు.. తెలుగు వచ్చిన వాళ్ల ముందు ఇంగ్లీషులో మాట్లాడటం ఎందుకో నాకు అర్ధం కాదన్నారు.. మాతృ భాషను మర్చిపోయిన వాడు మనిషి కాదు అని హెచ్చరించారు.. కోట్లాది జీవరాశులలో చైతన్య వంతమైన జీవరాశి, మానవ జాతి ది.. కొత్త సచ్చిదానంద మూర్తి సమాజంలో చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి అని కొనియాడారు.. ఆంగ్లంలో మాట్లాడే నాయకులు గొప్పవాళ్లు కాదు.. మన దేశ నాయకులు చత్రపతి శివాజీ, జాన్సీ లక్ష్మీబాయి, కొమరం భీం లాంటి మాతృ భాష మాట్లాడే నాయకులే గొప్పవాళ్లు అయ్యారన్నారు.. ఇక, మాతృ భాషలో చదువుకున్న మహిళ ఈ రోజు దేశ మొదటి మహిళగా ఉన్నారని అన్నారు.. కాన్వెంట్ మొహం చూడని నరేంద్ర మోడీ.. ప్రపంచదేశాల మన్నన పొందుతున్న మన దేశ ప్రధానిగా ఉన్నారని పేర్కొన్నారు.. మాతృ భాషను ప్రేమించండి, సోదర భాషను గౌరవించండి, అంతర్జాతీయ భాషని నేర్చుకోండి అని సూచించారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
Read Also: DSC Results 2024: ‘టీజీ డీఎస్సీ-2024’ పరీక్ష ఫలితాలు విడుదల
Also Read
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..