DSC Results 2024: ‘టీజీ డీఎస్సీ-2024’ పరీక్ష ఫలితాలు విడుదల.. దసరా లోపు టీచర్ పోస్టుల భర్తీ..
- 'టీజీ డీఎస్సీ-2024' పరీక్ష ఫలితాలు..
- సచివాలయంలో డీఎస్సీ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DSC Results 2024: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ నిర్వహించిన ‘టీజీ డీఎస్సీ-2024’ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు సచివాలయంలో డీఎస్సీ పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి, నామా, కొండ సురేఖ, సీఎస్.. విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. అభ్యర్థులు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్ష రాశారు.
విద్యాశాఖ అధికారులు అతి తక్కువ సమయంలో ఫలితాల కోసం విశేష కృషి చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2,46,584 మంది డిఎస్సి 2024 పరీక్షలకు హాజరు అయ్యారని తెలిపారు. 1:3 ప్రాతిపదికన ఫలితాలు విడుదల చేసామన్నారు. ఫైనల్ నియామకాలు దసరా పండుగ లోపు చేస్తాం. 9.10.2024 లోపు సర్టిఫికెట్ వేరిఫికేషన్ చేసి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తామన్నారు. తెలంగాణలో దసరా పండుగ ప్రతీ ఒక్కరు ఘనంగా నిర్వహించుకుంటారన్నారు. గత ప్రభుత్వం 7 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారన్నారు. డిఎస్సి నిర్వహణ చేయక పోవడం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. 66 రోజుల్లో పరీక్షలు నిర్వహించి, ఫలితాలు విడుదల చేయడంలో పేద ప్రజల పట్ల మా చిత్తశుద్ధి కనిపిస్తోందన్నారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 30 రోజుల్లోనే ఎల్బీ స్టేడియంలో నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంగడి సరుకుగా మారిందన్నారు. త్వరలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేస్తామన్నారు. అన్ని శాఖల్లోని భర్తీ కానీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. గతంలో పేరుకు పోయిన చెత్తను తొలగిస్తామని వివరించారు. ఉపాధ్యాయ ఉద్యోగం భావోద్వేగాలతో కూడిన పోస్టులు చేశారని తెలిపారు. గతంలో గురుకులాలు ఏర్పాటు చేశానన్న చంద్రశేఖర్ రావు పిట్టగూళ్ల లాంటి నిర్మాణాలు చేశారని మండిపడ్డారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. పది సంవత్సరాలు టీచర్ల ప్రమోషన్స్, బదిలీలు జరగలేదని తెలపిఆరు. ఎలాంటి వివాదాలు లేకుండా బదిలీలు చేశామన్నారు. 21419 మందికి ప్రమోషన్స్ ఇచ్చామన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేవని కొందరు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న వారు ఏం చేశారు? అని ప్రశ్నించారు. అన్ని స్కూల్స్ లో మౌలిక వసతులు కల్పించడం మా ప్రభుత్వ భాద్యత అన్నారు. నెహ్రు కృషి వల్ల వ్యవసాయ రంగం బలోపేతం అయ్యిందన్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!