Crime News: సిద్ధిపేటలో దారుణం.. ఆస్తి కోసం కన్నతల్లిని కడతేర్చిన కూతురు..
- సిద్ధిపేట జిల్లా వర్గల్ సమీపంలోని మీనాజీపేటలో దారుణం..
- ఆస్తి కోసం కన్న తల్లినే దారుణంగా హత్య చేసిన కూతురు..
- నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చిన కూతురు.. ఏం తెలియనట్టు తన తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో చిన్న కూతురు నవనీత బాగోతం బయట పడింది. వర్గల్ మండలం మీనాజీపేట గ్రామంలో జరిగిన ఘటన. వివరాల్లోకి వెళితే, బాల నర్సయ్య, బాలమణి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొడుకులు లేకపోవడంతో చిన్న కూతురు నవనీతకి వివాహం చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నారు. ఇక, పెద్ద కూతురు లావణ్యకి అర ఎకరం భూమి ఇద్దామని చిన్న కూతురు నవనీతతో తల్లి బాలమణి చెప్పింది. తల్లి బతికి ఉంటే తన కొంత ఆస్తి అక్కకు పోతుందని మొత్తం తనకే దక్కాలని తల్లిని దారుణంగా హత్య చేసింది.
Also Read
అయితే, తన తల్లి దగ్గర నుంచి రూ.3 లక్షలు అప్పు తీసుకున్న వ్యక్తితో కలిసి చిన్న కూతురు నవనీత హత్యకు ప్లాన్ చేసింది. తల్లిని హత్య చేస్తే అప్పుగా తీసుకున్న నగదు ఇవ్వాల్సిన అవసరం లేదని ఒప్పందం చేసుకుంది. ఈ నెల 10వ తేదీన తల్లి పడుకున్న తర్వాత మొహంపై దిండు పెట్టి చిన్న కూతురు, అల్లుడు, అప్పు తీసుకున్న వ్యక్తి హత్య చేశారు. ఇక, ఈ నేరాన్ని పెద్ద కూతురిపై మోపడానికి నిందితులు మృతదేహాన్ని తునికి బొల్లారం చెరువులో ప్లాస్టిక్ కవర్ లో చుట్టి పడేశారు. ఆ తర్వాత తన తల్లి కనిపించడం లేదని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 16వ తేదీన కుళ్ళిన స్థితిలో ఉన్న బాలమణి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమ స్టైల్ లో విచారణ చేయగా నిందితులు నిజం ఒప్పుకోవడంతో చిన్న కూతురు నవనీత, అల్లుడు మధుతో పాటు గౌరయ్యలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.
తాజావార్తలు
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!