Fraud: సామాజిక సేవ పేరుతో భారీ మోసం.. భారీగా పెట్టుబడులు పెట్టిన అమాయకులు
- థర్డ్ పార్టీ ఫండ్ (టీపీఎఫ్) పేరుతో తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసం
- బాధితుల ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన పోలీసులు
- బాధితుల లిస్టు భారీగా ఉండటంతో విస్తుపోతున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థర్డ్ పార్టీ ఫండ్ (టీపీఎఫ్) పేరుతో తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసానికి పాల్పడుతున్నారు. రూ.12 లక్షలు కడితే సంవత్సరానికి 36 లక్షల రూపాయలు మీ ఖాతాలో జమవుతుందంటూ బాధితులకు నమ్మబలికారు. తీరా డబ్బుల గురించి అడిగితే మాయమాటలు చెబుతున్నారు. ఈ క్రమంలో మోసపోయామాని తెలుసుకున్న కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివకుమారి, నవీన్ అనే ఇద్దరు కీలక వ్యక్తులు టీపీఎఫ్లో ఉండేవారని.. వారు చెప్పే మాయ మాటలు విని తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఒరిస్సా నుండి కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టామని బాధితులు చెబుతున్నారు.
Read Also: Formula E-Race Case : కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు కాపీలో కీలక అంశాలు
Also Read
- Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
సీఎస్ఆర్ ఫండ్స్, సామాజిక సర్వీస్ పేరుతో అమాయకులను ముగ్గులోకి దింపుతున్నారు టీపీఎఫ్ సంస్థ ప్రతినిధులు.. ఎక్కడ ఉందో తెలియని సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టి కొందరు అమాయకులు మోసపోయారు. ఇప్పుడు టీపీఎఫ్ సంస్థ ప్రతినిధులు కనిపించకపోవడం విదేశాలకు పారిపోయారన్న అనుమానంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ స్కాంలో కీలక సూత్రధారిగా వ్యవహరించిన శివ కుమారి అనే మహిళను పిలిపించి పోలీసులు విచారించారు.
Read Also: BSNL Recharge: ఆలోచించిన ఆశాభంగం.. ఊహించని ధరకి 14 నెలల వ్యాలిడిటీ
టీపీఎఫ్, సీఎస్ఆర్ పేర్లతో అమాయక ప్రజలకు డబ్బు ఆశ కల్పించి ఏపీ, తెలంగాణ, ఒడిశాల్లో 200 మందిని సభ్యులుగా చేర్చుకొన్న ఈ సంస్థ.. కోట్లల్లో వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో శివకుమారి కీలకపాత్ర పోషించారని.. నవీన్బాబు, షేక్ గౌస్తో పాటు వారి కుటుంబసభ్యులు, వారికి సహకరించిన అందరిపైనా కఠిన చర్యలు తీసుకుని, తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరారు. న్యాయం చేయాలని.. లేదంటే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని కన్నీరు మున్నీరయ్యారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!