Fraud: సామాజిక సేవ పేరుతో భారీ మోసం.. భారీగా పెట్టుబడులు పెట్టిన అమాయకులు
- థర్డ్ పార్టీ ఫండ్ (టీపీఎఫ్) పేరుతో తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసం
- బాధితుల ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన పోలీసులు
- బాధితుల లిస్టు భారీగా ఉండటంతో విస్తుపోతున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థర్డ్ పార్టీ ఫండ్ (టీపీఎఫ్) పేరుతో తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసానికి పాల్పడుతున్నారు. రూ.12 లక్షలు కడితే సంవత్సరానికి 36 లక్షల రూపాయలు మీ ఖాతాలో జమవుతుందంటూ బాధితులకు నమ్మబలికారు. తీరా డబ్బుల గురించి అడిగితే మాయమాటలు చెబుతున్నారు. ఈ క్రమంలో మోసపోయామాని తెలుసుకున్న కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివకుమారి, నవీన్ అనే ఇద్దరు కీలక వ్యక్తులు టీపీఎఫ్లో ఉండేవారని.. వారు చెప్పే మాయ మాటలు విని తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఒరిస్సా నుండి కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టామని బాధితులు చెబుతున్నారు.
Read Also: Formula E-Race Case : కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు కాపీలో కీలక అంశాలు
Also Read
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
సీఎస్ఆర్ ఫండ్స్, సామాజిక సర్వీస్ పేరుతో అమాయకులను ముగ్గులోకి దింపుతున్నారు టీపీఎఫ్ సంస్థ ప్రతినిధులు.. ఎక్కడ ఉందో తెలియని సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టి కొందరు అమాయకులు మోసపోయారు. ఇప్పుడు టీపీఎఫ్ సంస్థ ప్రతినిధులు కనిపించకపోవడం విదేశాలకు పారిపోయారన్న అనుమానంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ స్కాంలో కీలక సూత్రధారిగా వ్యవహరించిన శివ కుమారి అనే మహిళను పిలిపించి పోలీసులు విచారించారు.
Read Also: BSNL Recharge: ఆలోచించిన ఆశాభంగం.. ఊహించని ధరకి 14 నెలల వ్యాలిడిటీ
టీపీఎఫ్, సీఎస్ఆర్ పేర్లతో అమాయక ప్రజలకు డబ్బు ఆశ కల్పించి ఏపీ, తెలంగాణ, ఒడిశాల్లో 200 మందిని సభ్యులుగా చేర్చుకొన్న ఈ సంస్థ.. కోట్లల్లో వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో శివకుమారి కీలకపాత్ర పోషించారని.. నవీన్బాబు, షేక్ గౌస్తో పాటు వారి కుటుంబసభ్యులు, వారికి సహకరించిన అందరిపైనా కఠిన చర్యలు తీసుకుని, తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరారు. న్యాయం చేయాలని.. లేదంటే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని కన్నీరు మున్నీరయ్యారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!