Fraud: సామాజిక సేవ పేరుతో భారీ మోసం.. భారీగా పెట్టుబడులు పెట్టిన అమాయకులు
- థర్డ్ పార్టీ ఫండ్ (టీపీఎఫ్) పేరుతో తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసం
- బాధితుల ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన పోలీసులు
- బాధితుల లిస్టు భారీగా ఉండటంతో విస్తుపోతున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థర్డ్ పార్టీ ఫండ్ (టీపీఎఫ్) పేరుతో తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసానికి పాల్పడుతున్నారు. రూ.12 లక్షలు కడితే సంవత్సరానికి 36 లక్షల రూపాయలు మీ ఖాతాలో జమవుతుందంటూ బాధితులకు నమ్మబలికారు. తీరా డబ్బుల గురించి అడిగితే మాయమాటలు చెబుతున్నారు. ఈ క్రమంలో మోసపోయామాని తెలుసుకున్న కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివకుమారి, నవీన్ అనే ఇద్దరు కీలక వ్యక్తులు టీపీఎఫ్లో ఉండేవారని.. వారు చెప్పే మాయ మాటలు విని తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఒరిస్సా నుండి కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టామని బాధితులు చెబుతున్నారు.
Read Also: Formula E-Race Case : కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు కాపీలో కీలక అంశాలు
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
సీఎస్ఆర్ ఫండ్స్, సామాజిక సర్వీస్ పేరుతో అమాయకులను ముగ్గులోకి దింపుతున్నారు టీపీఎఫ్ సంస్థ ప్రతినిధులు.. ఎక్కడ ఉందో తెలియని సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టి కొందరు అమాయకులు మోసపోయారు. ఇప్పుడు టీపీఎఫ్ సంస్థ ప్రతినిధులు కనిపించకపోవడం విదేశాలకు పారిపోయారన్న అనుమానంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ స్కాంలో కీలక సూత్రధారిగా వ్యవహరించిన శివ కుమారి అనే మహిళను పిలిపించి పోలీసులు విచారించారు.
Read Also: BSNL Recharge: ఆలోచించిన ఆశాభంగం.. ఊహించని ధరకి 14 నెలల వ్యాలిడిటీ
టీపీఎఫ్, సీఎస్ఆర్ పేర్లతో అమాయక ప్రజలకు డబ్బు ఆశ కల్పించి ఏపీ, తెలంగాణ, ఒడిశాల్లో 200 మందిని సభ్యులుగా చేర్చుకొన్న ఈ సంస్థ.. కోట్లల్లో వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో శివకుమారి కీలకపాత్ర పోషించారని.. నవీన్బాబు, షేక్ గౌస్తో పాటు వారి కుటుంబసభ్యులు, వారికి సహకరించిన అందరిపైనా కఠిన చర్యలు తీసుకుని, తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరారు. న్యాయం చేయాలని.. లేదంటే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని కన్నీరు మున్నీరయ్యారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!