Nadendla Manohar: రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాను అభివృద్ధి బాటలో నిలబెడతాం..
- గుంటూరు జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశం
- పాల్గొన్న మంత్రులు నాదెండ్ల మనోహర్.. కందుల దుర్గేష్.. పలువురు ఎమ్మెల్యేలు
- జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో అధికార యంత్రాంగంతో చర్చించాం- నాదెండ్ల
- రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాను అభివృద్ధి బాటలో నిలబెడతాం- నాదెండ్ల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లా కలెక్టరేట్లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్లో జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో అధికార యంత్రాంగంతో చర్చించామన్నారు. రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాను అభివృద్ధి బాటలో నిలబెడతామని తెలిపారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చేయడంతో పాటు జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం కలిపి ముందుకు తీసుకు వెళ్తామని పేర్కొన్నారు. మరోవైపు.. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో జిల్లాలో ఏడు లక్షల మంది లబ్ధి పొందుతారు.. ఉచిత గ్యాస్ పథకం సమాచారాన్ని ఆయా కంపెనీలు లబ్ధి దారులకు సమాచారం ఇస్తారని అన్నారు. నవంబర్ 1 నుండి మార్చి 31 వరకు ఉచిత సిలిండర్ ఉపయోగించుకోవచ్చని మంత్రి అన్నారు.
Read Also: Chiranjeevi: ANR జాతీయ అవార్డు అందుకున్న చిరంజీవి
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పని చేయాలని అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం పని చేయాలని తెలిపారు. వ్యవసాయం, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం, సబ్సిడీ పై ఆహార పదార్థాలు అందించడం అంశాల పై చర్చించామని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు.. అమరావతిని, గుంటూరు జిల్లాను ఏక కాలంలో సాధిస్తామని అన్నారు. గుంటూరు ఛానల్ ఆధునికీకరణ కోసం ప్రభుత్వం నిధులు సేకరిస్తుంది.. స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా బీచ్ల అభివృద్ధి చేయబోతున్నామని మంత్రి చెప్పారు. నవంబర్ 9 నుండి సీ ప్లేన్ అందుబాటులో ఉంటుంది..
ప్రకాశం బ్యారేజ్ నుండి శ్రీశైలంకు సీ ప్లేన్ పెట్టబోతున్నామని అన్నారు. సూర్యలంక, కాకినాడ, ఋషికొండ బీచ్లు అభివృద్ధి చేయబోతున్నామని పేర్కొ్న్నారు. ఋషికొండ రాజ భవంతిలో ప్రస్తుతం పర్యాటకులను అనుమతించడం లేదు.. కానీ భవిష్యత్లో సామాన్య ప్రజలను ఆ భవంతిలోకి అనుమతించేలా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
Read Also: Nagarjuna: చిరంజీవి డాన్స్ చూసి నాకు గుబులు పుట్టింది!
తాజావార్తలు
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
-
Satyadev : మహేష్ బాబు వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది: హీరో సత్యదేవ్ ఎమోషనల్!
-
Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
-
SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!