Rishiteswari Case: సంచలనం సృష్టించిన కేసు కొట్టివేత.. మరణమే శరణ్యం అంటున్న పేరెంట్స్..
- తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి కేసు..
- తుది తీర్పు వెలువరించిన గుంటూరు జిల్లా కోర్టు..
- సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసు కొట్టేస్తున్నామని తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishiteswari Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి కేసును కొట్టివేసింది గుంటూరు కోర్టు.. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా, రిషితేశ్వరి కేసు కొట్టేస్తున్నామని తుది తీర్పు వెలువరించింది గుంటూరు జిల్లా ఐదవ కోర్టు.. నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో తీవ్ర కలకలం సృష్టించిన విషయం విదితమే.. అయితే, 2015 జులై 14వ తేదీన నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్యకు ర్యాగింగే కారణమని సూసైడ్ నోట్ రాసింది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానని లేఖలో పేర్కొంది.. ఈ ఘటనపై అప్పట్లో సంచలనం సృష్టించింది.. బాధితురాలి కుటుంబసభ్యులు, బంధువులతో పాటు.. విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఇలా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించగా.. నేడు గుంటూరు జిల్లా 5వ కోర్టు తుది తీర్పు వెలువరిచింది..
Read Also: Sivakarthikeyan : ఆర్మీ నుంచి అరుదైన అవార్డు అందుకున్న హీరో శివ కార్తికేయన్
Also Read
అయితే, గుంటూరు కోర్టు తీర్పుపై రిషితేశ్వ రి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఈ కేసులో 170 మంది సాక్షులు ఉన్నారు.. మా అమ్మాయి రాసిన లెటర్ కూడా, ప్రతి అధికారికి అందించాం… వాటిని ఎందుకు ఈ కేసులో పరిగణనకు తీసుకోలేదో.. అర్థం కావడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.. మా బిడ్డ విషయంలో న్యాయం జరిగేందుకు, అవసరమైతే ముఖ్యమంత్రిని , ఉప ముఖ్యమంత్రిని కలుస్తాం అన్నారు.. మాకు పై కోర్టులకు వెళ్లి పోరాడే ఆర్థిక శక్తి లేదు.. ప్రభుత్వమే మా అమ్మాయి కేసు విషయంలో సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.. మా అమ్మాయి విషయంలో న్యాయం జరగకపోతే, మాకు మరణమే శరణ్యం అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రిషితేశ్వ రి తల్లిదండ్రులు..
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!