Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నికలో ట్విస్ట్..!
- గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల ట్విస్ట్..
- టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హైటెన్షన్..
- నిన్నటివరకూ ఏకపక్షమే అనుకున్న మేయర్ ఎన్నికల్లోకి వైసీపీ ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Mayor Election: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎంపిక టీడీపీ, వైసీపీల్లో హైటెన్షన్ పుట్టిస్తుంది.. నిన్నటివరకూ ఏకపక్షమే అనుకున్న మేయర్ ఎన్నికల్లోకి వైసీపీ అనుహ్యంగా ఎంట్రీ ఇవ్వడంతో టీడీపీ నేతలు ఎలర్ట్ అయ్యారు.. మరోవైపు కూటమి అభ్యర్దిగా టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర నామినేషన్ దాఖలు చేశారు.. మేయర్ ఎన్నికపై వైసీపీ విప్ జారీ చేసింది. అయితే, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావటి మనోహర్ తనపదవికి రాజీనామా చేశారు. దీంతో మేయర్ ఎన్నిక అనివార్యం అయ్యింది.. టీడీపీ, వైసీపీ పార్టీలు మేయర్ పదవికోసం పోటీ పడుతుండడంతో ఏం జరుగుతుందోననే టెన్షన్ అందరిలో మొదలయ్యింది. దీంతో వైసీపీ, టీడీపీ నేతలు క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టారు. తమ కార్పొరేటర్లను క్యాంపులకు తరలించారు. వాస్తవానికి కార్పొరేషన్ లో వైసీపీకి 46 మంది కార్పొరేటర్ల బలం ఉంది. టీడీపీకి 9, జనసేనకు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు ఐదుగురు, ఎన్నికల తర్వాత 11 మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమిలోచేరారు. దీంతో కూటమికి కార్పొరేషన్ లో బలం పెరిగింది.
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
ఇదే సమయంలో మేయర్ పదవికి కావటి మనోహర్ రాజీనామా చేశారు. మొదట్లో మేయర్ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ, వైసీపీ నేతలు తమకు బలం ఉందని, పోటీ చెయ్యకపోతే కూటమికి మేయర్ పదవి దక్కే అవకాశం ఉండడంతో పోటీ చేయాలని భావించింది. ఇందుకు సంబంధించి వైసీపీ నుంచి కార్పొరేటర్లుగా గెలిచిన వారిలో ఒకరిని మేయర్ అభ్యర్దిగా బరిలో దించాలని భావించింది. ఇదే సమయంలో కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్రను ప్రకటించింది. పార్టీ బీఫారమ్ కూడా ఇచ్చింది. దీంతో కోవెలమూడి కలెక్టరేట్ లో మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గత నాలుగేళ్లుగా కార్పొరేషన్ లో జరిగిన అవినీతిపై పోరాడామని, గుంటూరు అభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మేయర్ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమంటున్నారు.
Read Also: BRS Rajatotsava Sabha: బీఆర్ఎస్ రజతోత్సవ సభ లైవ్ అప్డేట్స్..
మరోవైపు వైసీపీ కూడా మేయర్ ఎన్నికను సీరియస్ గా తీసుకుంది. గుంటూరు జేసీని వైసీపీ కార్పొరేటర్లు కలిశారు. మేయర్ ఎన్నికలకు సంబంధించి విప్ జారీ చేసేందుకు సంబంధించిన డాక్యుమెంట్లను అందించారు. వైసీపీకి చెందిన కార్పొరేటర్లను ప్రలోభపెట్టి టీడీపీలోకి బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. మేయర్ ఎన్నికల్లో వైసీపీ కూడా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ తరపున గెలిచిన కార్పొరేటర్లందరికీ విప్ జారీ చేసినట్లు తెలిపారు. విప్ కు విరుద్దంగా ప్రవర్తిస్తే అనర్హత వేటు వేస్తామని తేల్చిచెబుతున్నారు. వైసీపీ విప్ జారీ చేయడంతో మేయర్ ఎన్నిక రసవత్తరంగా మారింది. మేయర్ పీఠం కోసం రెండు పార్టీలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!