Ambati Rambabu: అంబటి రాంబాబు హాట్ కామెంట్స్.. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పగలరా..?
- మాజీ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్..
- వైసీపీ కార్పొరేటర్లను తాము కొనడం లేదని చెబుతున్నారు..
- దేవుడి మీద ప్రమాణం చేసి ఆ మాటలు చెప్పాలని సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు.. వైసీపీ కార్పొరేటర్లను తాము కొనడం లేదని చెబుతున్న కేంద్రమంత్రి.. దేవుడి మీద ప్రమాణం చేసి ఆ మాటలు చెప్పాలని సవాల్ విసిరారు.. కేంద్ర మంత్రి చెప్పే, పిట్టకథలు, పిల్ల కథలు గుంటూరు ప్రజలకు చెబితే నమ్మరని, టీడీపీ నేతలకు దిమాక్ ఎంత ఉందో త్వరలోనే చూస్తామన్నారు.. వైసీపీ కార్పొరేటర్లను సంతలో పశువుల్లా కొంటున్నారని ఆరోపించిన ఆయన.. దాంతో ఉదయం మాకు సంబంధం లేదని చెప్పి, మధ్యాహ్నానికి కార్పొరేటర్ల మెడలో కేంద్రమంత్రి పసుపు కండువాలు వేస్తున్నారని, ఇదేం తీరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..
Read Also: Gold Price Today : పసిడి ప్రియులకు షాక్ .. మరోసారి 83వేలు దాటిన బంగారం..
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
కాగా, గుంటూరు కార్పొరేషన్ రాజకీయాలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. దిమాక్ ఉన్న వాళ్లు ఎవరూ కార్పొరేటర్లను డబ్బులతో కొనరు.. మేం చేస్తున్న అభివృద్ధి చూసి వైసీపీ కార్పొరేటర్లు క్యూలు కడుతున్నారని పేర్కొన్నారు.. మైకు దొరికిందని మాట్లాడే అంబటి వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన కొట్టిపారేశారు.. అయితే, కేంద్రమంత్రి వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ చేసిన అంబటి.. కార్పొరేటర్లను కొనడం లేదని చెబుతున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దేవుడి మీద ప్రమాణం చేసి ఆ మాట చెప్పగలరా ? అని సవాల చేశారు.. పొద్దున కొనడం లేదని చెప్పి , మధ్యాహ్నానికి వైసీపీ కార్పొరేటర్ల మెడలో టీడీపీ కండువాలు వేస్తున్నారు అని మండిపడ్డారు.. ఇదంతా మీ అభివృద్ధి చేసి వస్తున్నారా? ఈ పిట్టకథలు, పిల్ల కథలు వేరే వాళ్ళకి చెప్పుకోండి… గుంటూరు ప్రజలకు కాదు అన్నారు.. వైసీపీ నాయకులకు దిమాక్ ఉందో లేదో త్వరలో చూపిస్తాం.. స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో టీడీపీ గెలవలేదు అని ఛాలెంజ్ చేశారు.. వైసీపీ గెలిపించిన మేయర్ ను గద్దించటం టీడీపీ నాయకుల వల్ల కాదు.. వాళ్లు ఏదో చేస్తాఉంటే మేం చూస్తా ఉంటామా? అని ప్రశ్నించారు అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాష’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!