Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Job Fraud: గుంటూరు జిల్లాలో ఉద్యోగాల పేరుతో విద్యార్థులను మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ప్రముఖ విద్యాసంస్థ అయిన ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తమ సహచరులనే లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కడప జిల్లాకు చెందిన విజయ నరసింహ, వరుణ్ అనే విద్యార్థులు “వెబ్ ఎక్స్” పేరుతో స్టార్టప్ కంపెనీ నడుపుతున్నామని తోటి విద్యార్థులను నమ్మించినట్లు సమాచారం. తమ కంపెనీలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, భారీ ప్యాకేజీలతో ప్లేస్మెంట్లు కల్పిస్తామని చెప్పి పలువురిని ఆకర్షించారు.
ఈ నమ్మకంతో పలువురు విద్యార్థులు లక్షల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు డబ్బులు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మొత్తం 40 మంది విద్యార్థుల నుంచి దాదాపు కోటిన్నర రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. అయితే నెలలు గడిచినా ఎలాంటి ఉద్యోగాలు రాకపోవడంతో విద్యార్థులకు అనుమానం మొదలైంది. దీంతో విజయ నరసింహ, వరుణ్లను పలుమార్లు ప్రశ్నించగా వారు కమాయమాటలు చెబుతూ కాలయాపన చేసినట్లు బాధితులు చెబుతున్నారు. చివరకు మోసపోయామని గ్రహించిన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి మంగళగిరి రూరల్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థుల నుంచి సేకరించిన డబ్బు ఎక్కడికి వెళ్లింది, ఇంకా మరెవరైనా ఈ మోసంలో ఉన్నారా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగాల పేరుతో వస్తున్న ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!