Ambati Rambabu: వారి చెప్పు చేతల్లో పోలీసు వ్యవస్థ పని చేస్తున్నట్లు కనిపిస్తుంది..
- గుంటూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు
- వైసీపీ నాయకులపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి
- జగన్తో పాటు వైసీపీ నేతల కుటుంబాలపై అసభ్య కామెంట్స్ చేస్తున్నారు- అంబటి రాంబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ కీలక నాయకులపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్తో పాటు వైసీపీ నేతల కుటుంబాలపై ఐ టిడిపి అనే పేరుతో అసభ్య కామెంట్స్ చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ విషయంలో ఈ నెల 17,18,19 తేదీలలో అనేక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశామన్నారు. ఆ ఫిర్యాదులపై ఇప్పటి వరకు కేసులు కూడా పెట్టినట్లు సమాచారం లేదని అంబటి రాంబాబు తెలిపారు.
Read Also: IPL 2025 Mock Auction: ఐపీఎల్ మాక్ వేలంలో రికార్డ్ ధరలకు అమ్ముడుబోయిన రిషబ్ పంత్, కేఎల్ రాహుల్
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
వైసీపీ సోషల్ మీడియా ఆక్టివిస్ట్లను అరెస్టు చేస్తున్నారు.. ఇప్పటికీ 100 మందిపై కేసులు పెట్టారని అంబటి రాంబాబు తెలిపారు. వైసీపీ నేతలపై టీడీపీ నాయకుల ట్విట్టర్లో సైతం దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. తాము 10 ఫిర్యాదులు చేస్తే ఒక్క కేసు నమోదు కాలేదన్నారు. కానీ వైసీపీ క్యాడర్ పై 300 కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. టీడీపీ నాయకుల చెప్పు చేతల్లో పోలీసు వ్యవస్థ పని చేస్తున్నట్లు కనిపిస్తుంది.. ఇలాగే పోలీసులు ప్రవర్తిస్తే తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు.
Read Also: Champai Soren: చంపై సోరెన్ జయకేతనం.. సెరైకెలా నుంచి గెలుపు
తప్పు ఎవరు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవాలి.. మాజీ మంత్రులు ఫిర్యాదునే పట్టించుకోక పొతే ఎలా..? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇదే విషయం పై పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తాం.. తాము ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన కేసులు నమోదు చేయడం లేదన్నారు. ఐదు స్టేషన్లలో తాము ఇచ్చిన పది ఫిర్యాదులలో కేసులు నమోదు చేయాలి.. లేదంటే ఉన్నత న్యాయ స్థానాలలో ప్రైవేటు కేసులు వేస్తామని అంబటి రాంబాబు తెలిపారు.
తాజావార్తలు
-
Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
-
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
-
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!