Andhra Pradesh Crime: పెళ్లింట విషాదం.. శోభనం రాత్రి పడకగదిలోనే వరుడు మృతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లింట విషాదం నెలకొంది.. పండుగ వాతావరణంలో పెళ్లి జరిపించి ఒక రోజు గడవక ముందే వరుడు కన్నుమూయడం తీవ్ర విషాదంగా మారింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలోని మదనపల్లెలో పెళ్లి జరిగి 12 గంటలు గడవక ముందే వరుడు మృతిచెందాడు.. చంద్రాకాలనీలో తులసిప్రసాద్కు శిరీష అనే యువతితో సోమవారం ఉదయం వివాహం జరిగింది… ఇక, మంగళవారం రాత్రి పెళ్లి కూతురు ఇంటి దగ్గర శోభనానికి ఏర్పాట్లు చేసినట్టు చేశారు.. అయితే, శోభనం రోజు రాత్రి పడకగదిలోనే వరుడు తులసిప్రసాద్ మృతి చెందడంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Also: AP Assembly Session: రేపటి నుంచే అసెంబ్లీ.. చంద్రబాబు కూడా సభకు రావాలి!
Also Read
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
అయితే, తులసిప్రసాద్ గుండెపోటుతో మృతిచెందినట్టుగా తెలుస్తోంది.. ఉన్నట్టుండి పడకగదిలో వరుడు అచేతనంగా పడిపోవడంతో.. ఆందోళనకు గురైన వధువు.. కుటుంబ సభ్యులకు తెలిపింది.. వారు వెంటనే వరుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే తులసిప్రసాద్ మృతిచెందినట్టు చెబుతున్నారు.. మృతిచెందిన వరుడు తులసిప్రసాద్ స్వగ్రామం పాకాల మండలం కట్టకిందపల్లి.. దీంతో, మదనపల్లి నుంచి వరుడు మృతదేహాన్ని అతడి స్వగ్రామానికి తరలించారు కుటుంబ సభ్యులు.. అయితే, పెళ్లి జరిగిన ఒక్కరోజులోనే వరుడు మృతిచెందడం.. విషాదంగా మారింది.. కాగా, వధూవరులిద్దరూ గతంలో ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్నారు.. కానీ, పెళ్లి జరిగి.. పచ్చిన పందిళ్లు, తోరనాలు వాడిపోకముందే.. వరుడు ప్రాణాలు పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
-
Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
-
Harish Rao : ‘కరెంట్ ఉంటేనే వార్త’.. హరీష్ ఫైర్.!
-
Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశ .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!